కల్వకుర్తి, ఏప్రిల్ 10 : మాజీ ఎ మ్మెల్యే జైపాల్యాదవ్ను బుధవా రం హైదరాబాద్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాలపై చర్చించా రు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి కల్వకుర్తి నియోజకవర్గంలో 35వేల మెజార్టీ లభించింద ని, ఇప్పుడు జరుగబోయే పార్లమెం ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గతం క న్నా మరింత ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ముందుకు సాగుదామని జైపాల్యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీ నివాస్యాదవ్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.