ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 23 : దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.4.40 లక్షలు, కారు, బొలే రో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ రంజన్త్రన్కుమార్ సోమవారం కోదండాపూర్ సీఐ కార్యాలయంలో విలేకరులతో వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలకు చెందిన శ్రీనివాసులు వినాయకుల విగ్రహాల తయారీతోపాటు పొగాకు వ్యాపారం చేసేవా డు. ఈ క్రమంలో రాయిచూర్ నుంచి రూ.4.40 లక్షల విలువైన 30 పొగాకు సంచులను తీసుకొని నంద్యాలకు రా వాలని నందికొట్కూర్ గ్రామానికి చెం దిన తిక్కస్వామి, మౌలాలిలకు సూచించారు. తిక్కస్వామి తన బొలెరో వాహనంలో మౌలాలితో కలిసి వెళ్తుండగా.. ఉండవెల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దపోతులపాడు స్టేజీ స్పీడ్ బ్రేకర్ వద్ద వా హనాన్ని స్లో చేశారు. ఈ సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బొలేరోను అడ్డగించి తిక్కస్వామి, మౌలాలీలను బలవంతంగా కిందకు దింపి, వా రివద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకరు వాహనా న్ని పెద్దపోతులపాడు వైపునకు తీసుకెళ్లి అందులో ఉన్న పొగాకు ఉత్పత్తులను మరో వాహనంలో తరలించారు. అనంతరం ఖాళీ బొలేరోను తిక్కస్వామికి ఇ చ్చి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఈ విషయాన్ని తిక్కస్వామి.. శ్రీనివాసులుకు చెప్పాడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఉండవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. సీ ఐ సూర్యానాయక్ దర్యాప్తు చేపట్టారు. అయితే, ఏ-1 కొట్రాసుబ్బయ్య పదేండ్లుగా కర్నూల్, నంద్యాల చుట్టుపక్కల కిరాణం దుకాణాలకు పొగాకు రవాణా చేసేవాడు. నంద్యాలకు చెందిన కమ్మరి శ్రీనివాసులు.. సుబ్బయ్య వద్ద పొగాకు ఉత్పత్తులు కొనేవాడు. సుబ్బయ్యను రెండు నెలల కిందట పొగాకు ఉత్పత్తుల కేసులో నంద్యాల టౌన్-1 పోలీస్స్టేషన్లో శ్రీనివాసులు అరెస్ట్ చేయించాడు. కాగా, న్యాయస్థానం ఖర్చుల కింద రూ. 80వేలు ఇస్తానని ఇవ్వలేదు. అలాగే తిక్కస్వామి.. సుబ్బయ్య వద్ద రూ. 2.50 లక్షలు అప్పుగా తీసుకొని కేవలం రూ.1.20 లక్షలు ఇచ్చాడు. శ్రీనివాసు లు, తిక్కస్వామి కలిసి సుబ్బయ్యను మోసం చేసి వ్యాపారంలో పోటీకి వస్తున్నారు.
తనను మోసం చేసిన వారిపై ఎ లాగైనా పగ తీర్చుకోవాలని భావించిన కొట్రా సుబ్బయ్య ఈ నెల 20వ తేదీన చోరీకి పాల్పడ్డాడు. ఎస్పీ ఆదేశాల మే రకు డీఎస్పీ రంగస్వామి పర్యవేక్షణలో సీఐ సూర్యానాయక్, సీసీఎస్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు శ్రీహరి, బాలరాజు, అ య్యన్న గౌడ్, ఆనంద్, సిబ్బంది కలిసి కేసును ఛేదించారు. కొట్ర సుబ్బయ్య, వెంకట్రామయ్య, షేక్ ఖాజాపాషా, కరడ జయన్న, బోయనరేశ్, నవీన్, రాఘవేంద్ర, మండ్ల పరశురాముడు, బోయ మనోహర్లను సోమవారం ఉదయం కర్నూల్ పెద్ద మార్కెట్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును 72 గంటల్లోనే ఛేదించిన పోలీసులకు ఎస్పీ రంజన్త్రన్కుమార్ రివార్డులు అందజేశారు.