నాగర్కర్నూల్/బిజినేపల్లి, మే 4 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వంద రో జుల్లో నెరవేరుస్తామని చెప్పి.. అధికారం చేపట్టి నా లుగు నెలలైనా నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కందనూ లు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దని సూచించారు. శనివారం నాగర్కర్నూల్ మండలంలోని గన్యాగుల, చందుబట్ల, పెద్దముద్దునూర్లో ప్రచారం అనంతరం బిజినేపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే మర్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే బోర్లలో నీళ్లు ఇంకిపోయాయని.. తాగడానికి సైతం నీరులేక ప్రజలు అరిగోస పడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు, కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదని, పైగా రూ.2లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండన్నారు. అవ్వాతాతలకు రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500 పత్తా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే మహిళలు చీపుర్లు, చాటలతో బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పదేండ్ల పాలనలో ప్రజలకు ఒక్క మేలూ చేయలేదన్నారు. ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ప్రశ్నించే గొంతుకైన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చిక్కొండ శ్రీశైలం, నాయకుడు నాగం శశిధర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, నాయకులు మహేశ్వర్రెడ్డి, విజయ్, బాలస్వామి, పులేందర్రెడ్డి, మాధవరెడ్డి, చిన్నారెడ్డి, అశోక్, తిరుపతిరెడ్డి, నాగరాజు, రాములు తదితరులు ఉన్నారు.
విషసర్పాలు, చలిచీమలకు యుద్ధం
ఇది ధర్మ యుద్ధం.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కందనూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రితో కలిసి తిమ్మాజిపేటలో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. ప్రస్తుతం విష సర్పాలు, చలిచీమలకు మధ్య యుద్ధం మొదలైందన్నారు. ‘ఆరు గ్యారెంటీలతో అధికారం చేప ట్టి చేతులెత్తేశారు.. మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు. వారితో ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి’ అని ప్రజలకు సూచించారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని, కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. గురుకులాల కార్యదర్శిగా 10 లక్షలమంది పిల్లలను విద్యావంతులుగా మార్చానన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో ఉండే 2,100 ప్రణాళికలను కందనూలుకు తీసుకొస్తానన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్పై కుట్ర జరుగుతున్నదని, అందరం కలసికట్టుగా ఎదుర్కొని మళ్లీ సీఎంగా గులాబీ దళపతిని చేద్దామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి మా ట్లాడుతూ బీజేపీ అక్కరకు రాని పార్టీ అని, వారిని న మ్మొద్దన్నారు. కేసీఆర్పై రేవంత్రెడ్డి అభ్యంతరకరమైన భాష వాడుతున్నాడని విమర్శించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ మోసం తెలిసిందని, రెండోసారి మోసపోవద్దన్నారు. ప్రవీణ్కుమార్ ఎంపీ అయితే ఆయనతో కలిసి, అవసరమైతే ఆమరణదీక్ష చేసైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. ఏకే-47 లాంటి ప్రవీణ్ను ఎంపీగా గెలిపించాలన్నారు. స మావేశంలో బీఆర్ఎస్ నేతలు నాగం శశిధర్రెడ్డి, ఎం పీపీ రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, శ్రీనివాస్, వేణుగోపాల్గౌడ్, హుస్సేనీ, స్వామి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి పేదల బాగుకోసం రాజకీయాల్లోకి వచ్చాను. కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించాను. రేవంత్ పాలనలో ప్రజల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలోనే గురుకులాలను ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వి ద్యను అందించారు. పదేండ్లల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తన కూతురు జైలులో ఉన్నా కేసీఆర్ మాత్రం బెదరకుండా రైతుల పక్షాన కొట్లాడేందుకు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇవి పదేండ్ల నిజానికి, నాలుగు నెలల అబద్ధానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాగు, తాగునీరు అందక ప్రజలు సతమతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. హామీల అమలు దేవుడెరుగు.. వేసవిలో ప్రజలకు కనీ సం తాగునీటిని అందించలేకపోతున్నారు. మ న కష్టాలు తీరాలంటే.. పార్లమెంట్లో మనవా ణి పినిపించాలంటే.. నన్ను లోక్సభకు పంపించాలి. మీ పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో పూర్తి సహకారం అందిస్తా.
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి