దేవరకద్ర రూరల్, జనవరి 10: రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు చేపట్టి రైతుకు భరోసా కల్పించి రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. రైతులకు నేరుగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించి 10వ తేదీనాటికి రూ.50వేల కోట్లు చేరుకున్న సందర్భంగా రాష్ట్రమంతా క్లస్టర్లలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. అందులో భాగంగా సీసీకుంట మండలంలోని చింతకుంట క్లస్టర్లో సర్పంచ్ మోహన్గౌడ్, లాల్కోట క్లస్టర్లో జెడ్పీటీసీ రాజేశ్వరి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ముచ్చింతల క్లస్టర్లో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనం, రైతు సంబురాల్లో స్వర్ణసుధాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు, వ్యవసాయం ప్రాముఖ్యతను ఉద్దేశించి విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా.. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం రైతులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ధాన్యాగారాలు నిండి, అన్నదాత ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉన్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర మండలంలోని ఆరు క్లస్టర్లలో సోమవారం రైతువేదిక భవనాల్లో రైతుసంబురాలు నిర్వహించారు. నాగారం క్లస్టర్లో ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, దేవరకద్ర క్లస్టర్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, డోకూర్ క్లస్టర్లో పీఏసీసీఎస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, గోపన్పల్లి క్లస్టర్లో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, కౌకుంట్ల క్లస్టర్లో జెడ్పీటీసీ అన్నపూర్ణ, లక్ష్మీపల్లి క్లస్టర్లో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ కొండా సుగుణశ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం రైతులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆయా క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
రైతుబంధు వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మండల కేంద్రంలో సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్లు కొండా లక్ష్మయ్య, రామణారెడ్డి, ఎంఈవో రాజునాయక్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ లక్ష్మి, సీసీ బాలకిష్టమ్మ, నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని మల్కాపురంలో సోమవారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లప్ప, సర్పంచ్ నారాయణరెడ్డి, రవీందర్రెడ్డి, రాజేంద్రప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
మండలంలోని కోడుగల్, లింగంపేట్, పెద్దఅదిరాల, కొండేడ్, మాచారం, బూర్గుపల్లి, ఆలూరు, నసురుల్ల్లాబాద్లో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. నసురుల్ల్లాబాద్లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ నవీన్సాగర్, మునవార్, రవి, శేఖర్, షపీ, రఘ, రాములు, శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రైతుబంధుతో రైతుల ఇండ్లల్లో ముందుగానే సంక్రాంతి సంబురాలను తెచ్చిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలకేంద్రంలోని రైతువేదిక భవనం వద్ద డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రాపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ మోహన్నాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సర్పంచులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండల కేంద్రంతోపాటు కొత్తూర్, చిల్వేర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఎడ్లబండపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రాధికారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ప్రతాప్రెడ్డి, వెంకట్, రాఘవేందర్, దేవయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం, రైతువేదిక, కేతిరెడ్డిపల్లి, పెద్దరేవల్లిలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేతిరెడ్డిపల్లిలో జెడ్పీటీసీ కల్యాణితో కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ఎంపీటీసీ లింగూనాయక్, ఏఎంసీ డైరెక్టర్ శివానందరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, మైనార్టీ మండలాధ్యక్షుడు జమీరుల్లా, సర్పంచులు శంకర్, పీర్యానాయక్, రవినాయక్, రమేశ్, రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి అరుణ్కుమార్, పెద్దాయపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు బహుమతుల ప్రదానం
అడ్డాకుల, పెద్దమునగాల్చేడ్, పొన్నకల్, కందూరు రైతువేదికల వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహక నగదుతోపాటు, బహుమతులను జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే రైతులకు గౌరవం
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలతో దేశంలోని రైతులందరికీ గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మూసాపేట రైతువేదిక వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు వేసిన వారికి ప్రోత్సాహక నగదు అందజేశారు. జానంపేట, వేముల, పోల్కంపల్లి రైతువేదిక వద్ద కూడా ముగ్గుల పోటీలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతికొండయ్య, తాసిల్దార్ మంజుల, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్గౌడ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, శ్రీకాంత్రెడ్డితోపాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
రైతుబంధు, రైతుబీమా పథకాలను అందిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచినదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఐసీడీఎస్శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రభుత్వ పథకాలపై వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. అంగన్వాడీ టీచర్లు వేసిన ముగ్గులను చూసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, ప్రశాంత్రెడ్డి, లత, ఐసీడీఎస్ జిల్లా అధికారిణి జరీనాబేగం, సీడీపీవో మెహరున్సీసాబేగం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.