Ice apple | మహబూబ్నగర్ అర్బన్/మహ్మదాబాద్, ఏప్రిల్ 22 : భానుడు భగభగమంటున్నాడు. తన ప్రతాపాన్ని చూపుతూ చెమటలు కక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండవేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు పలుదారు లు వెతుక్కుంటున్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు, శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉం డేందుకు తాటిముంజలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దాదాపు మూడు నెలలపా టు లభించే ఈ ఫలాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్ని వయస్సుల వారు తినొచ్చు. విటమిన్-బి, బి 12, ఐరన్, కాల్షియం వం టివి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి.
వీటిలో అధిక శాతం నీరు ఉండడంవల్ల ఈ ఫ లాలను తింటే పొట్టలో నిండుగా నీరు ఉన్న అనుభూతి కలుగుతుంది. జూస్లా చేసి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించొచ్చు. అలస ట, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. గర్భిణులు, లివర్ సమస్యలు ఉన్న వారు వీ టిని తరుచుగా తీసుకోవాలి. తాటిముంజలను గుజ్జులా చేసి.. అందులో కొద్దిగా పాలపొడి కలిపి.. మొహానికి పూసుకున్న కొద్దిసేపటి తరువాత కడిగితే చర్మవ్యాధులు తగ్గుతాయి. చ ర్మం కాంతివంతంగా మారుతుంది.
కల్తీ లేని తాటి ముంజలను తినడం వల్ల శరీరంలో చక్కె ర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తా యి. వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజలకు మస్తు గిరాకీ ఉంటున్నది. గ్రామాలో విరివిగా లభించే ఈ పండ్లు ఇప్పుడు పట్టణాల్లో కూడా దొరుకుతున్నాయి. కుల్కచర్ల మండ లం అంతారం గ్రామం నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఆటోల్లో తీసుకొచ్చి జైల్, బసా్ంటడ్ చౌరస్తా, తోపుడు బండ్లపై పెట్టి డ జను రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.
ఉమ్మడి మహ్మదాబాద్ మండలంలోని రు సుంపల్లి, చిన్నవార్వాల్ గ్రామాల్లో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి సీజన్ వచ్చిందంటే వ్యాపారులు తాటి చెట్లు ఉన్న పొలాల యజమానులతో ఒప్పందం చేసుకుంటారు. చెట్ల నుంచి తాటిముంజలను వేరుచేసి ఆటో లు, ఇతర వాహనాల్లో పక్క జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. 100 తాటి ముంజలను రూ.400 చొప్పున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మం డలంలోని నంచర్ల గేట్ బ స్టాండ్, మహ్మదాబాద్, గా ధిర్యాల్ గేట్ల వద్ద రోడ్డుపై పెట్టుకొని విక్రయిస్తున్నారు.
మహిళలు బు ట్టల్లో తీసుకెళ్లి గ్రామా ల్లో అమ్ముతున్నారు. ఉమ్మడి మండలంలోని మూడు, నాలు గు గ్రామాల ప్రజలు తాటి ముంజల సీజన్లో ఉపాధి పొందుతున్నారు. ‘వేసవి సీజన్ లో తాటి చెట్లు ఎక్కి కాయ లు కోసి.. వాటిని కోస్గి, కొడంగల్, తాండూర్, కర్ణాటక రాష్ట్రంలోని ముదెళ్లి వరకు ఆటో లో తీసుకెళ్లి అమ్ముతా ను. సాయంత్రం వర కు రవాణా ఖర్చులు పోను రూ.4 వేల వర కు సంపాదిస్తున్నా ను.’ అని రుసుంపల్లి గ్రామానికి చెంది బు ర్జుకాడి ఆశన్న చెప్పాడు.