మరికల్, జూలై 7 : కోయిల్సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురే ఖారెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని తీలేరు గ్రామ శివారులో పంప్హౌస్తో కోయిల్సాగర్కు మోటరును ప్రారంభించి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 315 క్యూసెక్కుల నీటి ద్వారా చెరువులను నింపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు తిరుపతయ్య, రాజవర్ధన్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మతీ న్, యువజన విభాగం మండల అధ్యక్షుడు రాజేశ్, విజిలెన్స్ కోఆర్డినేటర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.