మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 10 : తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనానికి సతీసమేతంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి భగీరథ కాలనీ చౌరస్తా నుంచి ఎడ్ల ఎక్కించి గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నవధాన్యాలతో మంత్రికి తులాభారం వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1996 నుంచి ఉద్యోగ సమస్యలపై పోరాటం ప్రారంభించానని, సీఎం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి నుంచి ఆయన వెంట నడిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం అన్ని రంగాల్లో వెనకబడిన మహబూబ్నగర్ను అభివృద్ధి చేసుకుందామని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజా ఆశీర్వాదంతో రెండు సార్లు విజయం సాధించానన్నారు. రెడ్డి కమ్యూనిటీ భవనం కోసం అర ఎకరా స్థలం, రూ.కోటి నిధులను అందించామని, ప్రస్తుతంమెడికల్ కళాశాల సమీపంలో రెండు ఎకరాల విశాలమైన స్థలంలో రూ.3కోట్ల నిధులతో ఐదు అంతస్తుల రెడ్డి కన్వెన్షన్ నిర్మిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పక్కనే కృష్ణానది ఉన్నా సాగు, తాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేశారని, సీఎం కేసీఆర్ ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిస్తున్నదన్నారు. భవిష్యత్లో మహబూబ్నగర్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఒకానొక సందర్భంగా ఒక నాయకుడు అభివృద్ధి అంతా ఇప్పుడే చేస్తే భవిష్యత్లో చేయడానికి ఏముంటుందని ప్రశ్నించారని, అందుకు ఏండ్లుగా వెనుకబడిన పాలమూరుకు ఎంత సేవ చేసినా తక్కువేనని చెప్పానన్నారు. త్వరలో ఐటీ కారిడార్కు అమెరికా నుంచి మరో సంస్థ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటీకే హామీ ఇచ్చారన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించాలి..
పదేండ్ల క్రితానికి, ప్రస్తుత మహబూబ్నగర్కు చాలా తేడా ఉందని, అభివృద్ధిని చూడాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నా రు. పదేండ్లలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో కనీవిని ఎరగని విధం గా అభివృద్ధి చేసి చూపించారన్నారు.
గెలుపు కోసం ఎంతో శ్రమించారు..
ఎమ్మెల్సీగా పోటీలో నిలచిన తన గె లుపు కోసం మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎం తో శ్రమించారని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎన్నిక ఏకగ్రీవం చేసిన ఘనత మంత్రిదేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్నగర్ను మంత్రి అద్భుతంగా తీర్చిదిద్దారని, భవిష్యత్ తరాల కోసం అవసరమైన అభివృద్ధి ఇప్పుడే అందించారన్నారు. రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పాలమూరు అభివృద్ధే నిదర్శనం..
ప్రస్తుతం పాలమూరు అభివృద్ధే మంత్రి శ్రీనివాస్గౌడ్ చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి అన్నారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కవి ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, రెడ్డి ఆత్మీయ సమ్మేళన కన్వీనర్ నరసింహారెడ్డి, జెడ్పీటీసీలు విజయనిర్మలా రమణారెడ్డి, వెంకటేశ్వరమ్మ రవీందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కౌన్సిలర్లు కట్టా రవికిషన్రెడ్డి, అనంత్రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, శ్రీరామ గ్రూప్ అధినేత బెక్కరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, విఠల్రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ భారీ విగ్రహాన్ని మంత్రి క్రేన్ సాయంతో ఆవిష్కరించా రు. అనంతరం మంత్రిని భారీ గజమాలతో సన్మానించారు. గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మూడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ న ర్సింహులు, గణేశ్, కౌన్సిలర్లు గోవిందు, తిరుపతమ్మ, రవికిషన్రెడ్డి, రజక సం ఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, నవకాంత్, మల్లేశ్ ఐలమ్మ సేవా సమితి, రజక క్రాంతి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, నాగేశ్, నాగన్న పాల్గొన్నారు.