దళితబంధు.. సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులకు ఆర్థిక సాయం అందించి అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్ర భుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకం. ఇం దులో ఉమ్మడి పాలమూరులో వేలాది మం ది దళితులు లబ్ధి పొంది వివిధ రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందు తూ కుటుంబాలను పోషించుకుంటున్నా రు. అలాంటి పథకం అమలుపై కాంగ్రెస్ స ర్కారు హయాంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్థిక స్థిరత్వం నింపిన పథకంలో రెం డో విడుత ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభు త్వం దరఖాస్తులు స్వీకరించినా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్తో ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత మారిన రేవంత్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖా స్తులు మండల స్థాయిలోనే ఆగిపోయి కనీసం జిల్లా కార్యాలయానికి కూడా చేరలేదు. గ్రౌండింగ్ నిలిచిపోవడంతో దళిత వర్గాల్లో నిరాశ నెలకొన్నది.
నాగర్కర్నూల్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : సమాజం అభివృద్ధి చెందాలంటే అట్టడుగున ఉన్న దళితులు ఆర్థికంగా ఎదగడం కూడా ప్రధానమని నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి 2021 ఆగస్టు 5న దళితబంధును లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంక్ లింకేజీ లే కుండా పూర్తిగా వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. దళితులు కోరుకున్న యూనిట్లతో ఉపాధి పొందేలా కేసీఆర్ ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించింది.
రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఒకటిగా తొలుత నా గర్కర్నూల్ జిల్లాలోని చారకొండ మండలం ఎంపికైంది. ఈ మండలంలోని 17 పంచాయతీల్లో సర్వే చేపట్టిన అధికారులు 1,708 మందిని పథకానికి అర్హులుగా గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశారు. వంద శాతం సబ్సిడీతో దళితులు కోరిన పథకాలకు రుణాలను పారదర్శకంగా అందజేశారు. ఈ రుణాలతో అత్యధికంగా రవాణా రంగం ద్వారానే ఉపాధి పొందేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో కార్లు, జేసీబీలు, డీసీఎం, ట్రాక్టర్లులాంటి వాహనాలను కొనుగోలు చేశారు. అలాగే చికెన్ దుకాణాలు, సెంట్రింగ్, టెంట్ హౌస్, డీజే సౌండ్లాంటి పలు వ్యాపారాల్లో దళితులు స్థిరపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లాంటి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లాంటి అధికారుల సమన్వయంతో పారదర్శకంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ రుణాల పంపిణీ చేశారు. ఇలా మండలంలో దాదాపు దళితులందరూ ఈ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీ రుణాలను పొందడం గమనార్హం. మండలంలోని మొత్తం 1,708 యూనిట్లకుగానూ ఇప్పటి వరకు 1,627 మందికి (90 శాతం) రూ.10 లక్షల చొప్పున రుణాల పంపిణీ విజయవంతమైంది. కాగా తొలి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున ఒక్కో నియోజకవర్గంలో రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
రెండో విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 1,100 మంది లబ్ధిదారులకు సాయం అందించేందుకు కే సీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం దేశంలో ఇప్ప టి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా బడ్జెట్లో నా టి సర్కారు రూ.17 వేల కోట్లను కేటాయించడం విశేషం. దీంతో గత అక్టోబర్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,100 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో సాయం మంజూరు కాలేదు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటపై దళితులు ఆశలు పెట్టుకొన్నారు. రైతుభరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15 వేలు సాయం అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మాదిరే తాజాగా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించింది. ఇదే క్రమంలో దళితబంధు పథకానికి కూడా చే..యూత ఇవ్వాల్సిందిగా దళితుల నుంచి అభిప్రాయాలు వి నిపిస్తున్నాయి. తొలివిడుత పథకంతో లబ్ధిపొందిన దళితులకు ఆర్థిక భరోసా కల్పించగా.. రెండో విడుతపై కాంగ్రెస్ నిర్ణయం కోసం దళితులు ఎదురుచూస్తున్నారు.
దళితబంధుతో రూ.10 లక్షలు వచ్చిన వారు మంచిగా బతుకుతున్నరు. రెండో విడుతలో అన్ని సర్టిఫికెట్లు ఇచ్చి దరఖాస్తు చేసుకున్న. ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపేసిం డ్రు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని పథకం ఇస్తలేరు. జిల్లా అధికారులను అడిగితే మాకేం తెల్వదు అంటున్నరు. ప్రభు త్వం నుంచి మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదని చెబుతుం డ్రు. రూ.15 లక్షల సాయం దళితబంధులా ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పిండ్రు. రైతుబంధు పథకం పాత మాదిరిగానే ఇచ్చారు. ఆ విధంగా దళితబంధును రెండో విడుత కూడా అమలు చేయాలి. మా దళితులపై ప్రేమను నిరూపించుకోవాలి.
నారాయణపేట, జనవరి 2 : జిల్లాలో మొదటి విడుత దళితబంధు సాయం అందినప్పటికీ.. రెండో విడుత సా యంపై అధికారులు నోరు మెదపడం లేదు. కేసీఆర్ సర్కా రు హయాంలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల కు వంద యూనిట్ల చొప్పున జిల్లాకు 200 యూనిట్లు మంజూరు చేశారు. వీటికి వందశాతం నిధులు గ్రౌండింగ్ చేశారు. మొదటి విడుత సాయం అందుకున్న వారు టెంట్హౌస్, కిరాణా దుకాణాలు, ట్రాక్టర్లు, డోజర్లు, జేసీబీలు, కార్లు కొనుగోలు చేసి వాటి ద్వారా ఉపాధి పొందుతూ వస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండో విడుతగా ప్రతి నియోజకవర్గానికి 1,100 యూనిట్ల చొప్పున పేట, మక్తల్ నియోజకవర్గాలకు కలిపి 2,200 యూనిట్లు మంజూరయ్యాయి. గ్రామాల వారీగా అధికారులు దళితబంధు దరఖాస్తుల విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ అందజేయాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రెండో విడుత నిలిచిపోయింది. ఈ విషయంపై సంబంధిత జిల్లా అధికారి హరినాథ్రెడ్డిని వివరణ కోరగా.. రెండో విడుతకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగిస్తారా లేదా అనే విషయంపై దళిత కుటుంబాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఎంతో మంది పేదలకు వరమైంది. నేను కూడా దరఖాస్తు పెట్టుకుంటే మంజూరైనట్లు జాబితాలో పేరొచ్చింది. ఇక ఖాతాలో డబ్బులు పడతాయనుకున్న సమయంలో ఎ న్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఎ న్నికలు ముగిసి నెల రోజులవుతున్నది. దళితబంధు డబ్బులు మంజూరైతే కొత్త కారు కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతూ వచ్చే ఆదాయంతో జీవ నం కొనసాగిద్దామని అనుకున్నాను. కానీ ప్రస్తుత ప్రభు త్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి. దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. అందుకే పథకాన్ని నిలిపి వేయొ ద్దు. వెంటనే నిధులు మంజూరి చేసి ఆదుకోవాలి.
దళితబంధు తొ లి విడుతలో జిల్లా లో 301 మందికి, పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చారకొండలో దాదాపుగా 1,650 మందికి రూ.10 లక్షల చొ ప్పున ఆర్థిక సా యం అందించాం. రెండో విడుతలో ప్ర భుత్వం నుంచి ఎలాంటి గ్రౌండింగ్ కాలే దు. నియోజకవర్గంలో 1,100 మందిని ల బ్ధిదారులుగా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో గతంలో ఉన్న ఎమ్మెల్యేల ద్వా రా దళితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఎన్నికల కోడ్ రావడం, ప్రభు త్వం మారడంతో పథకం అమలుపై అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. తొలివిడుత లో ఎంపికైన లబ్ధిదారులు వివిధ రకాల యూనిట్లతో ఉపాధి పొందుతున్నారు.
కేసీఆర్ సర్కారు తప్పా గతంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసిన దా ఖలాలు లేవు. దళితుల కు టుంబాల్లో ఆశాజ్యోతిగా నిలిపిన మహనీయుడు కేసీఆర్. దేశంలోనే ఎక్క డా లేని విధంగా దళితబం ధు పథకాన్ని మన రాష్ట్రం లో అమలు పరిచారు. ఈ పథకం ద్వారా యువకు లు సాయం పొంది పాడి పశువులు, కోళ్లు, వివిధ యంత్ర పరికరాలు, షాపులు పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు ఎంతో మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకం అమలుకు నోచుకోకపోవడంతో దళితుల ఆశలు నిరాశగా మారాయి. దళితు ల అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ద ళితబంధును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలుకాకపోతే రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది.
– శివప్రసాద్, రామకృష్ణాపురం, కొత్తకోట మండలం
ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలను కొనసాగిస్తే ప్రజలకు మేలు జ రుగుతుంది. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రస్తుత ప్రభు త్వం కొనసాగించాలి. ఎ న్నో ఏండ్లుగా ఫొటోగ్రాఫ ర్ వృత్తిలో కొనసాగుతున్నాను. దళితబంధు పథకానికి అన్ని విధాలా అర్హుడనని గుర్తించి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నాపేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. రేపోమాపో డబ్బులు వస్తాయనుకున్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో నా ఆశలు అడియాశలయ్యాయి. దళితబంధు డబ్బులు వచ్చింటే సొంతం గా ఫొటో స్టూడియో పెట్టుకొని సమాజంలో గౌరవంగా బతకాలని అనుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అలాగే కొనసాగించి మాలాంటి నిరుపేద కుటుం బాలను ఆదుకోవాలి.
దళితబంధు పథకం నా కుటుంబాన్ని ఆదుకున్నది. మాది నిరుపేద కుటుంబం. ఎకరాల భూమి లేదు. భార్యాపిల్లలను పోషించుకునేందుకు డబ్బులు లేవు. ప్రైవేట్గా డ్రైవింగ్కు పోతూనే చిన్నచిన్న పనులు చేస్తూ కు టుంబాన్ని నడిపాను.. దళితబంధు పథకంలో మర్రి జనార్దన్రెడ్డి సారు నా పేరు పెట్టారు. నాకు రూ.10లక్ష లు వచ్చినయ్. ఎవరికీ ఒక్క రూపా యి ఇవ్వకుండా ఈ సాయం అందిం ది. ఇంతకు ముందు ఎస్సీ కార్పొరేషన్లో రూ.50 వేల రుణం కోసం ఎందరినో కలిసినా లాభం లేకపోయింది. ఎంపీడీవో నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వరకు దరఖాస్తు చేసుకున్నా.. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఒక్క రూపాయి రాలేదు. ఈ పథకం కోసం రేషన్కార్డు, ఆధా ర్ కార్డు, క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు ఇచ్చిన. దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే నాకు రూ.10 లక్షలు ఇచ్చిండ్రు. ఈ మొత్తంతో స్విఫ్ట్ కారు కొనుక్కొని సొంతంగా నడుపుతున్నా.. నెలలో 20 రోజులైనా పని దొరుకుతుంది. మా కుటుంబానికి అప్పులు లేకుండా హాయిగా బతుకుతున్నాం.