మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 2 : నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందుకు ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతున్నది. గ్రామీణస్థాయి నుంచి విజయవం తం చేసేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చే శారు. ఈ ఏడాది 1,10,136 మంది పిల్లలకు టీ కాలు వేయించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇం దులో భాగంగానే 4వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 3న కేంద్రాల్లో పోలియో చుక్కలు వేసిన తర్వాత మిగిలిన పిల్లలకు 4, 5వ తేదీల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వేస్తారు.
పల్స్ పోలియోకు వైద్యారోగ్య శాఖ 4 వేల మం ది సిబ్బందిని కేటాయించింది. ఆశావర్కర్లు 869, అంగన్వాడీ టీచర్లు 1,124, వ్యాక్సినేటర్లు 2,824, రూట్ సూపర్వైజర్లు 24 మంది ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని 946 గ్రామాల్లో మొత్తం 1,10,136 మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 583 బూత్లు, పట్టణాల్లో 93, బ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సంతలు, జాతరలు, జనసందోహం ఉండే మరో 25 ప్రాంతాల్లోనూ పల్స్ పో లియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 24 మొబైల్ బూత్లు పనిచేయనున్నాయి. 10 స్టా క్ పాయింట్లు ఉండగా, రూట్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా వ్యాక్సినేషన్తోపాటు ఇతర సా మగ్రిని ఆయా బూత్లకు తీసుకెళ్లనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సామగ్రిని అధికారులు ఇప్పటికే జిల్లాలోని పీహెచ్సీలకు పంపించారు. డీఎంహెచ్వో కృష్ణ మాట్లాడుతూ పల్స్ పోలియోపై ఇప్పటికే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహ న కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల డోస్లు సిద్ధంగా ఉంచామన్నారు.