మాగనూరు, మార్చి 24 : మండలంలోని వ డ్వాట్ సమీపంలోని బసవేశ్వర కాటన్ అండ్ జి న్నింగ్ మిల్లులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వడ్వాట్కు వె ళ్తున్న వ్యక్తులు కాటన్ మిల్లులో మంటలు చూసి 100కు డయల్ చేశారు. అలాగే పోలీసులు, ఫైర్ స్టేషన్, మిల్లు యజమానికి సమాచారం అందించా రు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడ కు చేరుకొని మిల్లులో పనిచేసే సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. అప్పటికే మిల్లులోని కాటన్ బండిల్స్, విత్తనాలు, మిషనరీ షెడ్డు దగ్ధమయ్యాయి.
అయితే మంటలు చెలరేగడానికి షార్ట్సర్క్యూట్ కారణమని మిల్లు యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.8 కోట్ల మేర ఆస్తినష్టం జరిగిందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం యజమానిని పరామర్శించి కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లు యజమాని దండె తిమ్మన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.