గట్టు, జనవరి 10 : కేసీఆర్ సర్కారు హయాంలోనే పల్లెలు అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అంతంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బలిగేరలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల అదనపు గది, పల్లె ప్రకృతివనాన్ని బుధవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాకే పల్లెలు ప్రగతి వైపు దూసుకుపోయాయన్నా రు. పల్లె ప్రకృతివనాలు, పంచాయతీలకు ట్రాక్టర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాళ్లు, రైతువేదికలు కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినా కూడా బీఆర్ఎస్ అభివృద్ధిని ఎవరూ కాదనలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ శ్యామల, వైస్ ఎంపీపీ సుమతి, సర్పంచులు హనుమంతు, ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ రూపవ తి, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీధర్గౌడ్, రామన్గౌ డ్, రామకృష్ణారెడ్డి, ఆనంద్గౌడ్, బస్వరాజు, బ జారి, తిమ్మప్ప, పుల్లారెడ్డి పాల్గొన్నారు.
గద్వాల, జనవరి 10 : వైద్య, ఆరోగ్యశాఖ మం త్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కలిశారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 300 పడకల దవాఖానలో అవసరమైన మౌళిక వసతుల కల్పనకు అదనంగా రూ.25 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. అలాగే ని యోజకవర్గంలోని పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ అధికారుల నియామకం చేపట్టాలన్నారు. నడిగడ్డ ఇప్పుడిప్పుడే విద్య, వైద్య పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.