మహబూబ్నగర్, నవంబర్ 28 : ఓటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.. తొందరపడి వేయకండి.. మీకూ కండ్ల ము గింట కనిపిస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్యూటౌన్ నుంచి క్లాక్టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా బైక్ను నడిపి క్లాక్టవర్కు చేరుకుని కార్నర్ సమావేశంలో మాట్లాడారు. తక్కువ కులం అయిన నన్ను ఇబ్బందులకు గురి చేయాలని అగ్రవర్ణాల వారు కొందరూ చూస్తున్నారని, ఇది సరియైన విధానం కాదన్నారు. కుట్ర చేసి రైతుబంధును ఆపి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతి పక్షాల కుట్రలను మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రౌడీ షీటర్లను వెనుక పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వా ళ్లు తిరుగుతున్నారని, కుల రాజకీయాలు చేస్తూ బీజేపీ నాయకులు తిరుగుతున్నారని తెలియజేశారు. ఇండియా, పాకిస్తాన్ అంటూ సంబోధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, గతంలో ఏమి చేయకుండ ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మహబూబ్నగర్ చుట్టు తిరిగి ఒక్కమారు చూస్తే ప్రతిపక్ష పార్టీల మెదడు పనిచేయడం లేదని, ఇలా అభివృద్ధి జరిగితే ఎలా అని వారు కుల్లుకుంటున్నారన్నారు.
ఎన్నికల సమయంతోపాటు పంట సాగు చేసే సమయం సమీపిస్తాయని ముందుగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుబంధు నిధులను అపడం జరిగిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతులకు ఇబ్బందులు రానివ్వకుండ రైతుబంధు డబ్బులను జమ చేయాలని విన్నవించడంతో ఎన్నికల కమిషన్ అమోదం తెలిపిందని తెలిపారు. దీని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుబంధు నిధులను నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీ తరువాత రైతుబంధు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తన తల్లిదండ్రులపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తాను పేదల పక్షాన ఉండి పనిచేశానాని అందుకే ప్రజలంతా తనకే అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, మూడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, పాల్గొన్నారు.
పాలమూరు/మహబూబ్నగర్అర్బన్, నవంబర్ 28 : మహబూబ్నగర్ పద్మావతి కాలనీ గ్రీన్బెల్ట్ వద్ద ఉన్న జ్యోతిబాఫూలే విగ్రహాం వద్ద వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల ద్వారానే బీసీలు బాగుపడే అవకాశం ఉందని మొట్టమొదట చెప్పిందే ఫూలే అని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేశంలో 60శాతం బీసీలకు అన్యాయం జరుగుతుందోనన్నారు. రాజకీయంగా అవకాశాలు వస్తేనే బీసీల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాలు వదిలేసి బీసీల అభ్యున్నతి కోసం అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. పేదల కోసం కష్టపడి పనిచేస్తున్న తమకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ బడుగు వర్గాల వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆయన పోరాటం చేశారని తెలిపారు. అదేవిధంగా బీసీలంతా ఐక్యమంతా ఐక్యంగా ఉండి బీసీ అభ్యర్థి అయిన మంత్రి శ్రీనివాస్గౌడ్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా మంత్రి నివాసంలో ఫూలే చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు రిజర్వేషన్లు అవసరమని తెల్చి చెప్పిన మొదటి వ్యక్తి జ్యోతిబాఫూలే అని, సమాజంలో అందరికీ దూరంగా ఉన్న వ్యక్తులను అక్కున చేర్చుకోని వారికి విద్యాను అందించిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శామని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, జేపీఎన్స్సీ కరస్పడెంట్ రవిప్రకాశ్, కోదండపాణి, సత్యంయాదవ్, మల్లికార్జున్, ఆన్సర్ పాల్గొన్నారు.