బాలానగర్, మే 29 : మండలంలోని ఎర్రకుంటతండా శివారులో సర్వేనెంబరు 270/4/2/2/ 2లోని 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఎర్రకుంటతండా, చింతకుంటతండావాసులు బుధవారం కలెక్టర్ రవినాయక్కు ఫిర్యా దు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనుచరుడు తూడి అ నిల్రెడ్డి సదరు విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా చదును చేసి ఫ్రీకాస్ట్ ప్రహరీని కూడా నిర్మించినట్లు తెలిపారు. సదరు పొలంలోని మట్టిని ఇతరులకు ఇష్టానుసారంగా విక్రయించినట్లు వివరించారు. ఈ విషయమై మైనింగ్శాఖ అధికారులకు ఫి ర్యాదు చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అందులోని మట్టిన తరలిస్తున్న అనిల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నాగేందర్, రవి, శ్రీనివాస్, సేవ్యా, రమేశ్ తదితరులున్నారు.