వనపర్తి టౌన్, అక్టోబర్ 25: ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది తమ ఓటుహక్కును వినియో గించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని సమయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. మరి స్థానిక ఎన్నికల్లో వీటి ప్రభావం మెండుగా ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో త మ వద్దే ఉంచుకున్న పోస్టల్ బ్యాలెట్ను రాజకీయ పార్టీలతో ఉద్యోగులు బేరసారాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలే పోస్టల్ బ్యాలెట్ను తమ చేతుల్లోకి తీసుకొని ఓటు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఎన్నికల సంఘం తాజాగా నిబంధనల్లో పలు మార్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను తమ వద్దనే ఉంచుకోకుండా తమకు కేటాయించిన కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుందని పోలింగ్ విధులు నిర్వహించే చోటే ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయను న్నది. ఆ కేంద్రంలో ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు ఫారం-12, ఫారం-12ఏను శిక్షణ సమయంలోనే అందించనున్నారు.
స్టల్ బ్యాలెట్ దుర్వినియోగం కాకుండా పూర్తిగా పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే 13 శాఖల ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పించింది. అం దులో అత్యవసర సేవలు ఉండేవారికి రైల్వే, ఎయిర్ఫోర్ట్ అథారిటీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్యారోగ్య శాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, పౌరసరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, ఎన్నికల సంఘం గుర్తించిన మీడియా ప్రతిని ధులకు , అన్నిమాపక శాఖలు ఈ జాబితాలో ఉన్నాయి.
జిల్లాలో 2,65,600 ఓట్లు ఉండగా ప్రస్తుతం సుమా రు 2వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. బ్యా లెట్ ఓట్లను ఈ ఎన్నికల్లో నూతనంగా పోలింగ్ కేంద్రాల వద్దే వినియోగించుకోనున్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక Polling Center ఏర్పాటు చేయడం మంచిదే. గతంలో బ్యాలెట్ పేపర్ ఉద్యోగికి ఇవ్వడంతో రాజకీయ నాయకులు సేకరిం చేవారు. స్వేచ్ఛగా ఓటు వేయాలనుకున్న వేయలేక పోయేవారు. పోస్టల్ బ్యాలెట్ తో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం కాకుండా నిబంధ నలో ఎన్నికల సంఘం మార్పులు చేయడం మంచి పరిణామమే. మారిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలె ట్ను తమకు కేటాయించిన కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పోలింగ్ విదులు నిర్వర్తించే చోటే ఓటు హక్కును విని యోగించుకోవడం సరైందే. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు శిక్షణ సమయంలోనే ఫారం-12, ఫారం -12ఏను అందజేస్తారు. ఈసీ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం.