నాగర్కర్నూల్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : పోడు రైతు ల ఆకాంక్షలు నెరవేరే తరుణం ఆసన్నమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు.. ము ఖ్యంగా గిరిజనులు హక్కుదారులుగా మారబోతున్నారు. గతేడా ది నవంబర్, డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించి గ్రామం నుం చి జిల్లా స్థాయి వరకు విచారణ చేపట్టారు. అటవీహక్కు చట్టం-2006 ప్రకారం గిరిజనేతరులు అటవీ భూముల్లో కనీసం మూ డు తరాలు అంటే దాదాపుగా 75 ఏండ్లపాటు సాగు చేస్తూ ఉంటే పోడు పట్టాకు అర్హులు. ఇక గిరిజనులు మాత్రం 2005కు ముం దు నుంచి సాగులో ఉంటే చాలు. ఇలా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు అంచనాలకు మించి వచ్చాయి. వాటినన్నింటినీ గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించి.. అర్హులకు పట్టాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత నెలలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లతో పాస్ పుస్తకాలు రూపొందించారు. దీనికోసం రైతుల ఓటరు, రేషన్ కార్డు లేదా గ్రామ పె ద్ద ధ్రువీకరణ వంటి ఆధారాన్ని ఆన్లైన్లో జతపర్చారు. రైతుల ఆధార్, ఓటర్ వివరాల మేరకు పౌరసరఫరాల శాఖ, జిల్లా ఎన్నికల ఆన్లైన్లో నుంచి ఆర్డీవోలు వివరాలు సేకరించారు. డూప్లికేట్ దరఖాస్తులు, మైనర్లు, సేద్యంలో లేని రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, పోడు పట్టాలు పది ఎకరాలకన్నా ఎక్కువగా ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా భారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టిన అధికారులు.. అర్హులైన రైతులందరికీ పట్టాలు అందించనున్నారు. గతేడాదికిపైగా ప్రభుత్వం పోడు భూముల పట్టాల పంపిణీకి దశల వారీగా చర్యలు తీసుకుంటున్నది.
కేంద్రం నిబంధనలతో పంపిణీలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో తొలి విడుతలో గిరిజన రైతులకు పట్టాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన రైతులను ఎంపిక చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు త యారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచనున్నారు. ఎన్నికల కోడ్ నే పథ్యంలో పట్టాల పంపిణీ వాయిదా పడింది. వచ్చే నెలలో ప్ర భుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత కూ డా ప్రభుత్వం రైతులకు పట్టా పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ కొనసాగించనున్నది. ఇలా పోడు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో పోడు రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
పోడు భూములపై నవంబర్లో దరఖాస్తులు స్వీకరించక ముందు అధికారుల అంచనా మేరకు నాగర్కర్నూల్ జిల్లాలో 2,302 మంది రైతుల ఆధీనంలో 7,449 ఎకరాలను చెంచులు, చెంచేతరుల స్వాధీనంలో ఉన్నట్లుగా భావించారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక ఊహించిన దాని కంటే అధికంగా వి నతులు రావడం కొసమెరుపు. ఏకంగా 11,800 మంది రైతుల నుంచి 35 వేల ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇందులో 4,614 మంది ఎస్టీ రైతుల నుంచి 17,166 ఎకరాలకు గానూ దరఖాస్తులు రాగా.., 5,517 మంది గిరిజనేతరులు 18,024 ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే నాగర్కర్నూల్లో అత్యధికం గా పోడు భూములు ఉన్నాయి. జిల్లాలోని 65 గ్రామ పంచాయతీలు, 76 ఆవాసాల పరిధిలో రైతులు దరఖాస్తులు చేసుకున్నా రు. అమ్రాబాద్ మండలంలోని మాచారం, చిట్లంకుంట, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, సోమశిల, పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండా, మారేడుమాన్దిన్నె తండా, అచ్చంపేట, పదర, లింగాల మండలాల్లో అ ధిక సంఖ్యలో పోడు రైతులు ఉన్నారు. జిల్లాలో 1,950 మందికి పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు 1,154 మంది రైతుల పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉంచారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మా తాతల కాలం నుంచి మాకు మూడెకరా లు ఉన్నది. మేము ఇద్దరం అన్నదమ్ములమూ ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. పట్టాపాస్పుస్తకం లేకపోవడంతో రైతుబంధు రావ డం లేదు. రుణాలూ ఇస్తలేరు. మా తాత, నాన్న లు కూడా పట్టాల కోసం అందరి చుట్టూ తిరిగిండ్రు. ఎవ్వరూ పట్టాలు ఇస్తామని చెప్పలేదు. ఇస్తాం, వస్తది అంటున్నట్లుగానే వింటూ వచ్చా ను. ఇక పట్టాలు వస్తాయన్న ఆశలు పోయిన య్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా. సీఎం కేసీఆర్ సా ర్ ఇప్పటివరకు చెప్పినవన్నీ ఇచ్చిండు. పోడుభూముల పట్టాలు వస్తాయన్న నమ్మకం ఉన్నది. పట్టాలు ఇస్తే లోన్లు తెచ్చుకుంటం. రైతుబంధు వస్తది. భూమికీ విలువ వస్తుంది. సీఎం సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– బాలూనాయక్, మారేడుమాన్దిన్నె, పెద్దకొత్తపల్లి మండలం
ప్రభుత్వ ఆదేశాలతో పంపిణీ..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 11 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు 1,154 పట్టాలు పూర్తయ్యాయి. తొలి విడుతలో 2వేల మందికి పట్టా పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల కోడ్ ఉండడంతో తదుపరి ప్రభుత్వ ఆదేశాలతో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్