మక్తల్ అర్బన్, ఏప్రిల్ 29: మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్ విధించాలని, మున్సిపల్ వర్కర్స్ పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పావని ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే చిట్టెం హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 38 ఎజెండా అంశాలలో 7, 27, 29 అంశాలను కౌన్సిల్ సభ్యులు తిరస్కరించారు. మిగతా 35 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఎజెండా అంశాలలో పారిశుధ్యం, పైప్లైన్, ఎలక్ట్రిక్ మోటర్ల రిపేర్, చలివేంద్రాల ఏర్పాటు, కోకోపిట్ కొనుగోలు, గణతంత్ర దినోత్సవాల ఖర్చు, అవెన్యూ యాదాద్రి ప్లాంటేషన్ నిర్వహణ, మున్సిపాలిటీ కేసుల ఖర్చు, గ్యాలరీ ర్యాంపు క్యాటిల్ గార్డెన్ సిబ్బంది గదుల రిపేర్ , మున్సిపల్ కార్యాలయం నిర్వహణ, వాహనాల రిపేర్, మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, 5హెచ్పీ మోటర్ కొనుగోలు, రెండో వార్డులో పారుశుధ్య నిర్వహణ, వినాయక చవితికి పట్టణంలో చేసిన పనులు, జంతువధశాల నిర్మాణం, ఇంజినీరింగ్ విభాగం, వీధి కుక్కల తరలింపు, వాణిజ్య దవాఖాన నిర్మాణం, సీడీపీ నిధుల నుంచి చేసేపనుల సమాచారం నిమిత్తం, మున్సిపల్ కార్యాలయం పెయింట్ తదితర అంశాలు అమోదం తెలిపారు. అదేవిధంగా ఫ్లెక్సీకి రూ.200, బెలూన్ ఫ్లెక్సీకి రూ.వెయ్యి జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ ప్రజలు నాకు అత్యధికంగా ఓట్లు వేశారని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలువడానికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. రోడ్లపై కూరగాయటలు అమ్మకుండా సమీకృత మార్కెట్లో విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల, కమిషనర్ మల్లికార్జున్ స్వామి, మున్సిపల్ ఏఈ నాగశివ, కౌన్సిలర్లు శ్వేత, జ్యోతి, ప్రసన్న, రాధిక, రాములు, మొగిలప్ప, ఇర్ఫానా సుల్తానా అన్వర్, నర్సింహులు, అర్చన, కోఆప్షన్ సభ్యులు పద్మ, శంషోద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
చివరిం గింజ వరకూ కొంటాం
మక్తల్, ఏప్రిల్ 29: యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ మండలం రుద్రసముద్రం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. టోకెన్ జారీ చేసిన ప్రకారంగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్ పాషా, శ్రీనివాస్గౌడ్, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు ఉన్నారు.