అచ్చంపేట రూరల్, మే 6 : అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ పు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు విమర్శించారు. సోమవారం నల్లమల లోతట్టు ఏ జెన్సీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్ర జలు గమనించాలన్నారు. నల్లమల నడింపల్లిలో పుట్టి పెరిగిన ప్రవీణ్కుమార్ను గెలిపించి పార్లమెంట్కు పంచాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని.. వారిని నిలదీయాలన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని.. కారు గుర్తుకు ఓటేసి ప్రవీణ్కుమార్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిం గిల్ విండో చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, నాయకులు సేవ్యానాయక్, రాజేశ్, బొడ్కానాయక్, రవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.