ఉమ్మడి జిల్లాలో జోరుగా పల్లె, పట్టణ ప్రగతి
ముమ్మరంగా పారిశుధ్య పనులు
ఎటు చూసినా పచ్చదనం.. పరిశుభ్రతే
శుభ్రంగా వీధులు, డ్రైనేజీలు
ట్రాక్టర్లతో చెత్త తొలగింపు
ప్రజల భాగస్వామ్యంతో పనులు
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్య చర్యలు, పురాతన ఇండ్ల కూల్చివేత, పాత బావుల పూడ్చివేత, విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. రహదారులను జేసీబీతో చదును చేశారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. చెత్తను పంచాయతీ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. స్వచ్ఛత పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలొచ్చి భాగస్వామ్యం అవుతున్నారు. దీంతో ఎటు చూసినా పచ్చదనం.. పరిశుభ్రతే దర్శనమిస్తున్నది.
నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 8 : ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అని భావించిన సర్కార్ పల్లె, పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.. ఈ కార్యక్రమం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతున్నది..
ఆరో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.. పారిశుధ్య పనులను పరిశీలించారు.. సిబ్బంది మురుగు కాలువలు శుభ్రం చేశారు.. స్థానికులు చేయి చేయి కలిపి రోడ్లను ఊడ్చారు.. పిచ్చి మొక్కలను తొలగించారు.. హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందించారు.. వాటర్ట్యాంకులను క్లీన్ చేశారు.. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పనులను పరిశీలించారు.. సిబ్బందికి సూచనలు ఇచ్చారు.. గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి పనుల్లో భాగస్వాములయ్యారు..
జడ్చర్లటౌన్ : జడ్చర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో పట్టణ ప్రగతి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దేవరకద్ర రూరల్ : కౌకుంట్ల గ్రామంలో వీధులను శుభ్రం చేస్తున్న ప్రజాప్రతినిధులు, మహిళలు
అడ్డాకుల మండలకేంద్రంలో పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 4వ వార్డులో పంచాయతీ సిబ్బంది రోడ్లకిరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. మొక్కల కొమ్మలను తొలగిస్తూ రోడ్డుపై వేయగా.. సిబ్బంది వాటిని ట్రాక్టర్లో వేశారు. ఈ సమయంలో చిన్నారులు మేము సైతం అంటూ సిబ్బందికి సహకరించారు. కొమ్మలను సేకరించి ట్రాక్టర్లో వేసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ చిన్నారులు చేసిన పని పలువురికి ఆదర్శంగా నిలిచింది. చిన్నారులను సర్పంచ్ మంజుల, స్థానికులు అభినందించారు.
– మూసాపేట(అడ్డాకుల), జూన్ 8
అయిజ : 12వ వార్డులో పాత ఇండ్లను కూల్చివేస్తున్న జేసీబీ