గద్వాల, ఏప్రిల్ 15 : అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్స్టాండ్లో తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి జలదీక్ష చేపట్టగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంఘీభావం తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే బండ్లకు హరీశ్రావు నిమ్మరసం ఇచ్చి దీక్షను వి రమింపజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ క ర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వం తో మాట్లాడి నీటిని విడుదల చేయించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ కళ్లు తెరిచి కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే వరకు ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగుతాయన్నారు. ఎన్నికల స మయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు ఉద్దెర మాటలని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలకు ఉద్దెర మాటలు చెప్పాడే తప్పా ఏనాడూ వారిని ఉద్దరించాలనే ఆలోచన లేదన్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పకపోతే ఈ ఐదేండ్లు రేవంత్ ఇక మ న మాట వినరని చెప్పారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నడిగడ్డ దాహార్తి తీర్చడానికి ఐదు టీఎంసీల నీటిని తీసుకురావాలని డిమాం డ్ చేశారు. ముఖ్యమంత్రివి మాటలు ఎక్కువ చేతలు త క్కువని విమర్శించారు. రా్రష్ట్రంలో రైతులు, ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పుతూ కాలం వెల్లదీస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు వ ద్దురో కాంగ్రెస్ సర్కారు అంటున్నారని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ నీరు, కరెంట్ కోసం ఎవరూ దీక్షలు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో 222మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కిట్లు బంద్ తిట్లు ఫుల్ అన్నారు. అధికార కాంగ్రెస్ మొద్దు నిద్రపోతున్నదని, వారి కళ్లు తెరిపించడానికే జలదీక్ష చేపట్టారని చెప్పారు. తమ ప్రభుత్వ హ యాంలో గట్టు ఎత్తిపోతల పనులు ప్రారంభించామని దానిని పూర్తి చేసే వరకు పోరాడుతామని చెప్పారు. రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం చేశాయన్నారు. ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టగా కేసీఆర్ ప్రభు త్వం వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిందని గుర్తు చేశారు.
గతంలో నెట్టెంపాడు ద్వారా 20వేల ఎకరాలకు నీరు పారడం గగనంగా ఉండగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.4లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు ఆరు గంటల కరెంట్ ఇస్తే నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొ ని కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి గోదాంలు కట్టామన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయి నా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందా అని ఆ యన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమా ఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని, రూ.2లక్షలు రుణమాఫీ చేసి ఉంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. మహిళలకు రూ.2500, వృద్ధులకు పింఛన్ రూ.నాలుగు వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాల్లో ఓటు అడగానికి వచ్చిన వారిని ఈ విషయాలపై నిలదీయాలని ప్రజలను కోరారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారు ఏమైందని ప్రశ్నించారు. గ్యారెంటీలతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క మాటను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టు కోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి బీజేపీ రైతులపై మొసలి కన్నీరు కార్చుతుందని చెప్పారు. బీజేపీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకం గా రైతులు ఉద్యమాలు చేస్తే 700 మందిని పొట్టన పెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
మోదీ, రేవంత్రెడ్డి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మా మీద పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ది రైతు ప్రభుత్వమన్నారు. మీఅందరి గొంతులు తడపడానికి కృష్ణానదీ జలాలను గద్వాలకు తీసుకురావడానికి మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఈ జలదీక్ష చేపట్టారని గద్వాలకు నీరు వచ్చేదాక పోరాటం కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలతో సీఎం రేవంత్రెడ్డి గారడీ చేస్తున్నారు. నడిగడ్డ ప్రజల దాహం తీర్చడానికి ఎమ్మెల్యే బండ్ల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జలదీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేను ఓడించడానికి ప్రయత్నించారు. మిగతా వ్యాపకాలపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహార్తిని తీర్చడంలో లేదు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ నుంచి ఐదు టీ ఎంసీలను తరలించే వరకు పోరాడుతాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రు లు పాలనను గాలికొదిలేసి ఏసీ గదుల్లో ఉన్నారు. మరికొందరేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ సమర్థవంతంగా తిప్పికొడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు నిజానికి, అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్కు మధ్య జరుగుతున్నాయి. నిజాయితీగా చెప్పినవన్నీ అమలు చేసిన బీఆర్ఎస్కు ప్రజలు ఓటు వేస్తారో.. అబద్ధపు మాటలు చెప్పే కాంగ్రెస్కు ఓటు వేస్తారో తేల్చుకోవాలి. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ గొంతును పార్లమెంట్లో వినిపిస్తా.
మీ సేవకుడిగా.. మీ కోసం నిరంతరం పనిచేస్తా.. మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడొద్దు. మా కంపెనీలో ఏటా 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించా ను. నువ్వు ప్రజలకు ఏం చేశావో చెప్పాలి. దీనిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. నేను పార్లమెంట్లో ఎన్ని సార్లు మాట్లాడానో నా రికార్డు చూడు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఎన్నికల్లో ఇచ్చి న హామీలు అమలు చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారు. రైతుల పంటలు ఎండిపోతున్నా.. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదు. ఈ ప్రభుత్వం కేవలం కేసీఆర్, బీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని, పరిపాలనను గాలికొదిలేసింది. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నది. అయినా ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. వాటిని అమలుచేసేవరకు సర్కారును వెంటాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు గోస పడుతున్నారు. పదేండ్లల్లో ఎప్పుడూ సాగు, తాగునీటి కోసం దీక్షలు చేసిన సంఘటనలు లేవు. గద్వాలలో 70 ఏండ్లల్లో జరుగని అభివృద్ధి పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. రాష్ట్ర ప్రజలు పుట్టెడు దుఃఖంతో అలమటిస్తున్నారు. ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే 2,500 ఎకరాల పంట నష్టం జరిగినా.. అటు ప్రభు త్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులకు రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలి. నడిగడ్డలో 99 శాతం ఓట్లు కారుగుర్తుకే వేయాలి. కొందరు దొంగలు, స్వార్థపరులు పార్టీని వదిలి వెళ్లిపోయి ద్రోహులుగా మిగిలిపోయారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలను దోచుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలి.