నాగర్కర్నూల్టౌన్, డిసెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇ చ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని స్పష్టం చేశారని, వంద రోజుల వరకు వేచి చూస్తామని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డి పే ర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయ న స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని కొంతమంది కార్యకర్తలు, నాయకులు కొంత మెరుగ్గా పనిచేసి ఉంటే నియో జకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీలు మహిళలకు ఉ చిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెం పు హామీలను మాత్రమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు తప్పా రెండు గ్యా రెంటీలు పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఆరోగ్య శ్రీ పెంపు పథకం ప్రా రంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి చెల్లించారని ప్రశ్నించా రు. సీఎం జిల్లాకు సంబంధించిన నా యకుడని, పాలమూరు-రంగారెడ్డి ఎ త్తిపోతల పథకం పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కృ ష్ణా గోదావరి జలాల హక్కులపై ప్రత్యే క దృష్టి సారించి వాటాను పూర్తిగా స ద్వినియోగం చేసుకోవాలని, అందుకు గానూ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని కోరారు. తొలి మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పా త్ర పోషించామని, 30 ఏండ్లుగా కాం గ్రెస్ పార్టీకి లేని శక్తిని కూడగట్టి నియోజకవర్గంలో బలోపేతం చేస్తే కాం ట్రాక్ట్ శక్తులు తనకు టికెట్ కేటాయించకుం డా ఆ పార్టీ నేతలు అన్యాయం చేయ డం వల్లే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వివరించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ హామీలను అమలు చేస్తేనే ప్ర భుత్వ మనుగడ సాధ్యమవుతుందన్నా రు. ప్రజలను మభ్య పెట్టేందుకు చేస్తు న్న ప్రకటనలను ప్రజలు నమ్మరని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొంతకాలం ప్రభుత్వానికి సమయం ఇచ్చిన తర్వాత కూడా హామీలను అ మలు చేయకపోతే కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో నా యకులు అర్థం రవి, లక్ష్మయ్య, బాలగౌడ్, కుర్మయ్య, కృష్ణారెడ్డి, సంతోష్రా వు, భీముడు, ఆహ్మద్పాషా, సత్యం, వెంకటస్వామి, రాజులతోపాటు నా యకులు, కార్యకర్తలు ఉన్నారు.