వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాదికన్నా ఎక్కువ స్థాయిలో వరి దిగుబడి పెరిగిందన్న అంచనా ఉన్నది. పెరిగిన మద్దతు ధరతో కొనుగోళ్లు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నులు, వనపర్తిలో 4 లక్షలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.45 లక్షలు, నాగర్కర్నూల్ జిల్లాలో 3.29 లక్షలు, నారాయణపేటలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖాధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ టెండర్ల ప్రక్రియ పూర్తవగా.. 10 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం చేశారు.
మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న ధాన్యం కొ నుగోలు కేం ద్రాలు ప్రారంభమవుతున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాది కన్నా దిగుబడి అధికంగా రానున్న నేపథ్యంలో మద్దతు ధ రతో ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా జిల్లాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. వరి కోతలు షురూ అయ్యాయి. ఇప్పటికే మహబూబ్నగర్, నారాయణపేట, దేవరకద్రతో, జోగుళాంబ గద్వాలతోపాటు అనేక చో ట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో గురువారం ఓపెన్ చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో అన్ని కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. లారీ ట్రాన్స్పోర్టు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రదేశానికి లారీల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు.
మద్దతు ధర పెంపుతో హర్షం..
ధాన్యానికి గతేడాది కంటే రూ.100 మద్దతు ధరను పెం చడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వరి ఏ గ్రేడ్కు రూ.1960 ఉండగా.. ఈసారి రూ.2,060.., వరి సాధారణ రకానికి రూ.1940 ఉంటే ఈసారి రూ.2,040కు పెంచారు. దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలు కేంద్రా ల్లో స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాక గతేడాది ధాన్యం కొనుగోలు విషయంలో అడ్డంకులు సృష్టించిన కేంద్రం ఈసారి తోక ముడిచింది. రాష్ట్రంలో రైతుల మద్దతు టీ(బీ)ఆర్ఎస్ పార్టీకే ఉండడంతో కేంద్ర పెద్ద లు కిమ్మనకుండా ఉంటున్నారు. గతంలో సరిహద్దు రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి వచ్చి ధాన్యాన్ని విక్రయించేవారు. ఈ సారి మద్దతు ధరలు పెంచడంతో అదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏ ర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండింతలు పెరిగిన దిగుబడి..
ఉమ్మడి జిల్లాలో ఈ సారి వర్షాలు పుష్కలంగా కురవడంతో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భూగర్భజలాలు కూడా పెరగడంతో బావులు, బోర్ల కింద వ్యవసాయం జోరందుకున్నది. దీంతో ఈసారి అన్ని పంటలు కలిపి సుమారు 19 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఈ క్రమంలో ధాన్యం దిగుబడి పెరుగుతుందని అధికారుల అంచనా. గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల్లో 1,03,254 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వనపర్తి జిల్లాలో 225 కేంద్రాల్లో 2.44 లక్షలు, జోగుళాంబ గద్వాలలో 63 కేంద్రాల్లో 51,655, నాగర్కర్నూల్ జిల్లాలో 224 కేంద్రాల్లో 1.25 లక్షలు, నారాయణపేట జి ల్లాలో 104 కేంద్రాల్లో 1,20,941 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కాగా, ఈ సారి మహబూబ్నగర్ జిల్లాలో 2 లక్షలు, వ నపర్తిలో 4 లక్షలు, జోగుళాంబ గద్వాలలో 2.45 లక్షలు, నాగర్కర్నూ ల్ జిల్లాలో 3.29 లక్షలు, నారాయణపేటలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి రైతులు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తుతారని మహబూబ్నగర్ జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి బాలరాజు తెలిపారు. ఈ సారి అన్నదాతలకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అన్ని ఏర్పాట్లు చేపట్టాం..
వనపర్తి జిల్లాలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది మాదిరిగానే ఈసారి 255 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. జిల్లా వ్యాప్తంగా కోటి గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ఇప్పటివరకు 62 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా పెద్దమందడి మండలంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నాం. కేంద్రాలకు వచ్చే ప్రతి గింజనూ కొనేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. రైతులు పూర్తి నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తీసుకొస్తే మద్దతు ధర అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 1.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా వస్తుందని అంచనా.
– కొండల్రావు, డీఎస్వో డీఎం, వనపర్తి