బాలానగర్, అక్టోబర్ 13 : 60ఏండ్లపాటు పాలించి తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నేడు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మేవారెవరూ లేరని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ము ఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అభివృద్ధిని విస్మరించిన వారికి ఓటేద్దామా..? నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న వారికి ఓటేద్దామా..? అనే విషయాన్ని ప్రజలు ఆ లోచించాలన్నారు. కాంగ్రెస్ వారెంటీ లే ని గ్యారెంటీలు ఇస్తున్నదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ అయితే, బీఆర్ఎస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ పానలో విఫలమైందని విమర్శించారు.
బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయపబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.ఈనెల 18న జడ్చర్ల లో నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పెద్దాయపల్లి చౌరస్తాలో సేవాలాల్ మహాపడిపూజకు హాజరై పూజలు నిర్వహించారు. సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు తెప్పమణి ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలంలోని వనమోనిగూడకు చెందిన 10 మంది నాయకులు, సురారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఇద్దరు ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మండలంలోని పెద్దబావి తండాలో సర్పంచ్ తిరుపతినాయక్, ఎంపీటీసీ వెంక్రటాం నాయక్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భం గా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేను సన్మానించారు. యువకులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, వైస్ ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిండెంట్ బాలునాయక్, బీసీసెల్ మండలాధ్యక్షుడు బాలయ్య, రైతు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి, ఎంపీటీసీలు అభిమాన్యు రెడ్డి, లింగూనాయక్, దేశముక్ ప్రతాప్రెడ్డి, యాదిరెడ్డి, జగన్నాయక్, సోమ్లానాయక్, నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన
నాయీబ్రహ్మణులు..
సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జేకే ప్యాలెస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈనెల 18న జడ్చర్ల పట్టణంలో సీఎం కేసీఆర్ సభను విజయవతం చేయాలని కోరా రు. అనంతరం మండలంలోని నాయీ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో 70మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, బీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, గిరిజన సంఘం నాయకుడు లక్ష్మణ్నాయక్, జగన్నాయక్, మహిపాల్రెడ్డి, రమేశ్నాయక్, వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు.
సీఎం బహిరంగ సభాస్థలం పరిశీలన..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జడ్చర్లలో ఈనెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్, పార్కింగ్ పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి, రమేశ్, సతీష్, మహేశ్, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి, ముడా డైరక్టర్ శ్రీకాంత్, నాయకులు పర్వత్రెడ్డి, దామోదర్, మురళి తదితరులు ఉన్నారు.