వనపర్తి, జనవరి 10 : జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ్యవసాయశాఖల అధికారుల తో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,500 ఎకరాల్లో రైతులు ఆయిల్పాం తోటలను సాగుచేస్తూ, లక్ష్యాన్ని చే రుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయం తో లక్ష్యాన్ని చేరుకున్నారని, ఈ సందర్భం గా కలెక్టర్ వారిని అభినందించారు. రైతు లు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని, సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలన్నారు.
ఆయిల్పాం రైతులకు వా ట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారి సందేహాలను అధికారులు నివృత్తి చేయాలన్నారు. త్వరలో కొత్తకోటలో ఆయిల్పాం ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి సురేశ్ మాట్లాడుతూ జిల్లాలో 12 ఎకరాలను ఆయిల్పాం తోటలను పెంచుటకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మూడు ఎకరాలకు మంజూరు చేయగా 2,500 ఎకరాల్లో తోటలను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ విస్తరణశాఖ అధికారుల సమన్వయంతో 3 వేల ఎకరాల్లో ఆయిల్పాం మొక్కలు నా టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల్లో 1,040 ఎకరా ల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నామని, జిల్లాలోని నర్సరీల్లో 3 లక్షల 42వేల నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి సు ధాకర్రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టు రామ్మోహన్, ఏవో రాంచందర్రావు, ప్రి యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారి కుమార్, సురేశ్కుమార్, ఏడీఏ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రెడ్క్రాస్ బలోపేతానికి సహకరించాలి
వనపర్తి, జనవరి 10 : రెడ్క్రాస్ను బలోపేతానికి ప్రతిఒక్కరూ సభ్యత్వ నమోదుకు కృషి చేయడంతో పాటు సహకరించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. మం గళవారం కలెక్టర్లో జిల్లా రెడ్ క్రాస్ సభ్యులతో కలెక్టర్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా రెడ్క్రాస్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సెంట్రేట ర్స్ ఎవరికి అమర్చారో వారి వివరాలను రి జిస్టర్లో పొందుపర్చాలని, పాఠశాలల వి ద్యార్థుల సభ్యత్వ నమోదు వివరాలను పూ ర్తి చేయాలన్నారు. సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఖాజాకుత్బుద్దీన్, వైస్ చైర్మన్ కలాంపాషా, జిల్లా కార్యదర్శి చీర్ల కృష్ణసాగర్, పాలకవర్గ సభ్యులు గోనూర్ యాదగిరి, ఒమర్, రాజేందర్ ఉన్నారు.