నారాయణపేట టౌన్, జనవరి 3 : పట్టణ శివారులో ని ర్మిస్తున్న 300 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనుల ను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష కాంట్రాక్టర్లను ఆ దేశించారు. మంగళవారం ప్రభుత్వ దవాఖాన పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను ఈ ఏడాది అక్టోబర్ చివ రి నాటికి పూర్తి చేయాలన్నారు. అనంతరం సమీకృత మా ర్కెట్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించి ఈ నెల 20వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్య త లోపం లేకుండా చూడాలన్నారు. మార్కెట్ భవనం ముందు భాగంలో ఉన్న హై టెన్షన్ వైరు స్తంభాల అలైన్మెం ట్ మార్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మ యాంక్ మిట్టల్, విద్యుత్ శాఖ డీఈ సంజీవరెడ్డి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సొసైటీల బలోపేతానికి కృషి చేయాలి
జిల్లాలో సహకార సంఘాల సొసైటీల బలోపేతానికి కృ షి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాలో కలిసి సహకార సంఘాల డైరెక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో చాలా సహకార సంఘాలు నష్టాలతో కొనసాగుతున్నాయన్నారు. సహకార సంఘాలు కేవలం వరి కొనుగోలు కేంద్రాలతోనే కాకుండా ఇతర వ్యాపారులు నిర్వహించి ఆర్థికంగా బలోపేతానికి కృ షి చేయాలన్నారు. వ్యవసాయ పనిముట్లు అద్దెకు ఇవ్వడం, పెంట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్ తదితర వ్యాపారాల నిర్వహణతో ఆర్థిక లాభాలు ఆర్జించడంతోపాటు రైతులకు మేలు కల్గించవచ్చన్నారు. నాబార్డ్ రు ణాలను సద్వినియోగం చేసుకొని మండలాల్లో గోదాముల నిర్మాణాలు చేపట్టాలన్నారు. డీసీసీబీ చైర్మన్ ని జాంపాషా మాట్లాడుతూ వెయ్యి మె ట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక్కో గో దాము నిర్మిస్తే బాగుంటుందన్నారు. డ్రోన్, హార్వెస్టర్స్, సూపర్ మార్కెట్లు, మాల్స్, ఫర్టిలైజర్ కేంద్రాలను నెలకొ ల్పి రెవెన్యూ అవకాశాలు పొందవచ్చాన్నారు. సమావేశం లో ఏడీఏ జాన్సుధాకర్, వివిధ మండలాల పీఏసీసీఎస్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి
ఈనెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో విడుత కం టి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సహచర మంత్రులు, ప్రధానకార్యదర్శి, ప్రి న్సిపల్ సెక్రటరీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, వైద్య అధికారులతో వీసీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసేందుకు సూచనలు చేశారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో జనాభా ప్రాతిపదికన 100 రోజుల్లో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు 24 టీమ్లను ఏర్పాటు చేశామన్నా రు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజలకు విస్త్రృతంగా అవగాహన కల్పించేందుకు టామ్ టామ్ వేయిస్తామని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మ యాంక్ మిట్టల్, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, పేట, మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్లు అనసూయ, పావని పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా నిర్వహించాలి
ఊట్కూర్, జనవరి 3 : ధరణి రిజిస్ట్రేషన్లు పారదర్శంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కు ఎంత సమయం పడుతుందని కంప్యూటర్ ఆపరేటర్ రామును అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ల పరంగా రైతు లు, కొనుగోలు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తాసిల్దార్ తిరుపతికి సూచించారు. పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.