నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మక్తల్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.