నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దులు కొట్లాడు కొంటూ దగ్గరలోని వ్యవసాయ బావిలో పడ్డాయి.
ఈ ఘటనలో ఒక ఎద్దు మృతి చెందింది. ఎద్దులను కాపాడే ప్రయత్నంలో గుర్రాల శ్రీను, గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరిని బావిలో నుంచి బయటకు తీసి మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎద్దులను క్రేన్ సాయంతో బయటకు తీశారు.