నారాయణపేట, జూన్ 2 : అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లాలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కార్యక్రమం అనంతరం జిల్లా కేంద్రంలోని వయో వృద్ధుల గృహాన్ని సందర్శించారు.
అక్కడే ఉన్న అనాథ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనాథ పిల్లలు మాకు ఎవరూ లేరని దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల అభ్యున్నతికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
బాగా చదువుకొని జిల్లా పాలనా అధికారి స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమం లో జిల్లా యస్పి యాన్ వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, DWO వేణుగోపాల్, అశోక్, కుసుమా తదితరులు పాల్గొన్నారు.