నారాయణపేట : నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రానికి ఎగువ వైపు ఉన్న కర్ణాటక రాష్ట్రం తోపాటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆల్మట్టి ప్రాజెక్టు ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన సందర్భంగా
కృష్ణా నదికి భారీగా వరద వస్తుండడంతో మక్తల్ మండల పరిధిలోని నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బుధవారం నియోజకవర్గంలో నది తీర ప్రాంతాలైన వాసునగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లను పరిశీలించి రైతులు, ప్రజలకు తగు సూచనలు చేశారు. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని ఎమ్మెల్యే చిట్టెం సూచించారు.