Petrol | మాగనూరు ఫిబ్రవరి 01: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెట్రోల్ బంక్ యజమాన్యం ఇష్టానుసారంగా పెట్రోల్ బంకు నిర్వహణ కొనసాగిస్తున్నారు. గత వారం రోజులుగా బంకులో పెట్రోల్, డీజిల్ ఉన్న నో స్టాక్ బోర్డులు పెట్టి ఈ పెట్రోల్ బంక్ పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్కర్స్కు చాలీచాలని జీతాలు ఇవ్వడంతో వారు పనిచేయడానికి సరిగ్గా రావడం లేదని.. దీంతో నో స్టాక్ బోర్డులు పెట్టి మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం నాడు పలువురు వాహనదారులు పెట్రోలు కోసం బంక్కు వెళ్లగా నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో బంక్ కస్టమర్ సర్వీస్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దానికి ఆ బంక్లో కావాల్సినంత పెట్రోల్ ఉందని చెప్పారు. దీంతో బంక్ యజమానికి ఫోన్ చేసి వాహనదారులు నిలదీశారు. 24 గంటలు పని చేయాల్సిన పెట్రోల్ బంకులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులో ఓపెన్ ఉంటుందని తర్వాత లైట్లు బంద్ చేసి పడుకుంటున్నారని 24 అసహనం వ్యక్తం చేశారు. దానికి, బంక్లోని మెషిన్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అలాగే లేబర్ ప్రాబ్లమ్స్ కూడా ఉందని యజమాని సమాధానమిచ్చారు. వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సక్రమంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరపాలని వాహనదారులు సూచించారు. ఇప్పటి నుంచైనా 24 గంటలు బంక్ పనిచేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.