నారాయణపేట, నవంబర్ 29: ఎనిమిదేండ్లుగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలో నిలబెడుతుందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని 14,15వ వార్డులోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది గీత కార్మికులు ఆ సంఘం నాయకుడు భీంచందర్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఎంపీ, ఎమ్మెల్యే గులాబీ కండు వా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్1 స్థానంలో నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వా రు పెద్దఎత్తున గులాబీ కండువా కప్పుకొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణబట్టడ్, కౌన్సిలర్లు బండి రాజేశ్వరి, అమీరుద్దీన్, మహేశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, నాయకులు సుదర్శన్రెడ్డి, గందె చంద్రకాంత్, జగదీశ్, శివరాంరెడ్డి, సుభాష్, మహిమూద్, రాజు, అలెనూర్ వినోద్, ఫిరోజ్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ‘దళితబంధు’ యూనిట్లు పంపిణీ
నారాయణపేట మండలం కొల్లంపల్లికి చెందిన సిద్ధి సాయమ్మకు బొలేరో, బోయిన్పల్లికి చెందిన బాల నర్సింహులుకు ట్రాక్టర్ను దళితబంధు యూనిట్ ద్వారా ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అందజేశారు. దళితులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని నారాయణపేట, నిడుగుర్తి, పొర్ల, లక్ష్మీపూర్కు చెందిన బోయ కులస్తులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ డాక్టర్ నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, నాయకులు రామ్మోహన్, జగన్నాథ్, వడెప్ప, వాల్మీకులు తదితరులు పాల్గొన్నారు.