మక్తల్ రూరల్: జాతీయ రహాదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మక్తల్ పట్టణ శివారులోని దండు క్రాస్ రోడ్డు వద్ద జరగుతున్న 167 వ జాతీయ రహాదారి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరికల్ సబ్ స్టేషన్ నుంచి కృష్ణ బ్రిడ్జి వరకు దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహాదారి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం మక్తల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
అలాగే నిర్మాణం పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనుల జాప్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయ న్నారు. వీలైనంత త్వరలో పట్టణ శవారులో నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం కోరారు. కాగా మక్తల్ పట్టణంలో ప్రస్తుతం బీటీ పనులు జరుగుతున్నాయని, అక్కడక్కడ కల్వర్టు పనులు ఉన్నాయని సంబంధిత అధికారులు వివరించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి ఉన్నారు.