Dharmendra Pradhan : కేంద్రమంత్రి (Union Minister) పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి పార్లమెంటు (Parliament) కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan).. కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) జైరామ్ రమేశ్ (Jairam Ramesh) వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ (Strog Counter) ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leakage) వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. సోమవారం పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
చిరునవ్వుతో కారు దిగిన ధర్మేంద్ర ప్రధాన్.. అందరికీ అభివాదంచేస్తూ లోపలికి వెళ్లారు. పలువురు అధికారపక్ష ఎంపీలు ఆయనకు సంఘీభావం తెలుపుతూ శాలువా కప్పి, సంప్రదాయ టోపీతో సత్కరించారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా ఒక మంత్రి స్వచ్ఛంధంగా రాజీనామా చేయడం ఇదే మొదటిసారని బీజేపీ ఎంపీల్లో ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్లమెంట్ కారిడార్లో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్.. ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి “అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది” అని వ్యాఖ్యానించారు.
దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఏమీ జరగలేదు. నేను వీధి పోరాటాల నుంచి వచ్చిన యోధుడిని (స్ట్రీట్ ఫైటర్ను), ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపించడంతో శనివారం ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదని, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో స్పష్టంచేశారు.