నారాయణపేట, ఫిబ్రవ రి 5 : మరో రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ల నుంచి అసంతృప్తి వ స్తుందని మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ స్పష్టం చేశా రు. పదేండ్ల బీఆర్ఎస్, రెండు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రతిఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుంటున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని బీ ఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అ ధ్యక్షుడు రాజేందర్రెడ్డి అ ధ్యక్షతన నియోజకవర్గ కా ర్యకర్తల విస్తృతస్థాయి స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్ర స్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తీరుపై రైతులు, పింఛన్దారులు ఆలోచనలో పడ్డారన్నారు. 70 ఏండ్లల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితికి రేవంత్రెడ్డి తీసుకొచ్చారన్నారు. తా ము అధికారంలో ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇచ్చాం.. కానీ కార్యకర్తలను పట్టించుకోలేకపోయామన్నారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసి మహబూబ్నగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదన్నారు.
రేవంత్రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని, ఆయనకు మతి భ్రమించిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదన్నారు. ఒకప్పటి, నేటి తెలంగాణకు చాలా తేడా ఉందన్నారు. కేసీఆర్ను ఎందుకు వదులుకున్నామనేది తెలంగాణ ప్రజలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
ప్రజలు, అన్ని పార్టీల సహకారంతో సాధించుకు న్న నారాయణపేట జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ర ద్దు చేసే ఆలోచనలో ఉన్నదని, ఇదే నిజమని తేలితే ప్రజలు హస్తం పార్టీ నేతల బట్టలూడదీసి కొడుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి హె చ్చరించారు. కొట్లాడి తెచ్చుకున్న జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాల యం, మెడికల్, డిగ్రీ క ళాశాలలు ఇచ్చిన ఘన త కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హ యాంలో ఎంతో అభివృద్ధి చేశామని, ప్రజల కు వివరించడంలో విఫలమయ్యామన్నారు. ఇ చ్చిన హామీలు అమలు కావాలంటే ఎంపీ సీట్లు గెలిపించాలని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, రెండునెలలు గడిస్తే కాంగ్రెస్ నాయకులను ప్రజలే తరిమికొడతారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ దొంగ బుద్ధి ప్రజలకు అర్థమైందన్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసోళ్లు కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.
ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని, ప్రతి ఊరిలో గులాబీ జెండా ఎ గురుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు ఇచ్చే స్థోమత లేదని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విమర్శించా రు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చా టుతుందని ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్ల మాజీ ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌ రవిస్తామని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, అయినా 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. సమావేశంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, సాట్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, నియోజకవర్గ ఇన్చార్జి దేవరి మల్లప్ప, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్రా వు ఆర్య, నియోజకవర్గ సమన్వయకర్త రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.