వెల్దండ: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామ ఉప సర్పంచ్ మహేశ్, వార్డు సభ్యుడు రాంరెడ్డి, యాదిరెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలు వేణు గోపాల్ రెడ్డి, నరేశ్, జంగయ్య, సురేందర్ రెడ్డి, నరేశ్లు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా నిలుస్తుందన్నా రు.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఆమనగల్ మండల టీఆర్ఎస్ పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు రూపం వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరి యాద వ్ తదితరులు ఉన్నారు.