నాగర్కర్నూల్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. పేదల కోసం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షా దీముబారక్ పథకం పెండ్లిండ్లకు ఆర్థిక సాయం, ప్ర భుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. వీటితోపాటు తాజాగా కేసీఆర్ న్యూ ట్రీషన్ పథకాన్ని ప్రారంభిస్తున్నది. కాన్పుల సమయంలో రక్తహీనతతో గర్భిణులు మృత్యువాతపడుతు న్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మా తాశిశు ప్రాణాల మీదకి వస్తున్నాయి. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా తొలి విడుతలో రాష్ట్రంలో ప్రధానంగా రక్తహీనత ఉన్న ఏడు జిల్లాల్లో న్యూట్రీషన్ కిట్లను అందించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లాతోపాటు జోగుళాం బ గద్వాల జిల్లాల్లోని గర్భిణులకు ఈ కిట్లను అందించనున్నారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, జోగుళాంబగద్వాల జిల్లాల్లోనూ బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచే ఆన్లైన్లో ఈ పథకాన్ని గర్భిణులకు అంకితం చేయనున్నారు. ఇదే విధంగా జోగుళాంబ గద్వాల జి ల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్లో పర్యాటక, ఎక్సైజ్ శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ మెడికల్ కళాశాలల్లో న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గా ల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి వారు పాల్గొనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 7,300 మంది..
నాగర్కర్నూల్ జిల్లాలో 7,300 మంది గర్భిణుల కు రక్తహీనత అధికంగా ఉన్నట్లుగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖాధికారులు గుర్తించారు. బుధవారం ఇందులో 80 మందికి లాంఛనంగా న్యూట్రీషన్ కిట్లను అం దించే ఏర్పాట్లను పూర్తి చేశారు. గర్భిణులకు 5వ నెల లో ఒకసారి 9వ నెలలో మరోసారి ఈ కిట్లను అందజేయనున్నారు. మొదటి కిట్ విలువ రూ.1,962 ఉండగా.. రెండో కిట్ విలువ రూ.1,818 చొప్పున దాదాపుగా రూ.4 వేల విలువైన వస్తువులను గర్భిణులకు అందించనున్నారు. ఈ కిట్లో మహిళలకు అవసరమైన మిక్స్ పౌడర్, ఐరన్ సిరప్, నెయ్యి, ఆల్బెండజోల్ మాత్రలు ఉంటాయి. అనంతరం దవాఖానల్లో కాన్పులు జరిగి మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆ డ శిశువు పుడితే రూ.13 వేల విలువైన కేసీఆర్ కిట్లు అందుతాయి. గర్భిణీగా పేరు నమోదైనప్పటి నుంచి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంతో తరచూ వైద్య పరీక్షలతో పాటుగా అంగన్వాడీల ద్వారా సంపూర్ణ పౌష్టికాహారంలో భాగంగా భోజనం, గుడ్లు, పాలు అందించనున్నారు. మొత్తం మీద మహిళల కోసం సీఎం కేసీఆర్ వివిధ పథకాలు అమలు చేస్తుండడం విశేషం. తాజాగా అమలవుతున్న కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకంతో గర్భిణులకు ఎంతో లబ్ధి చేకూరనున్నది.
నేడు పథకం ప్రారంభం
గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం అమలు చేస్తున్నాం. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానున్నది. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంత్రి శ్రీనివాస్గౌడ్ లాంఛనంగా 80 మంది గర్భిణులకు కిట్లను అందజేయనున్నారు.
సుధాకర్ లాల్, డీఎంహెచ్వో, నాగర్కర్నూల్