కల్వకుర్తిరూరల్, నవంబర్ 25: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై అవగాహన ఉండాలని కల్వకుర్తి సీఐ సైదులు సూచించారు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో సైబర్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ వలంటీర్కు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు తమకు సంబంధించిన వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. సెల్ఫోన్లలో పేటీఎం, గూగుల్పే, ఫోన్ పే, సిమ్ కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలు, ప్రమాదాలు జరిగినపుడు 100కు డయల్ చేయాలన్నారు. లేదా WWW.cybercrime.gov.inకి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సదస్సులో ఎస్సై మహేందర్, సైబర్ వలంటీర్లు విజేందర్గౌడ్, పవన్, రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
జిల్లాకేంద్రంలో..
సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీఐ గాంధీనాయక్ సూచించారు. జి ల్లాకేంద్రంలోని సాయిగార్డెన్స్లో సైబర్ నే రాలపై గురువారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. బ్యాంకు లావాదేవీలను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారన్నారు. మహిళలు సైతం చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయ్కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.