నాగర్ కర్నూల్ : బోన్ క్యాన్సర్తో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ బాధితురాలికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అండగా నిలిచారు. నాగర్ కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామానికి చెందిన రాములమ్మ గత కొన్ని రోజులుగా బోన్ కాన్సర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే ఆయన స్పదించి హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో ఆమెకు మెరుగైన వైద్య చికిత్సకోసం ముఖ్యమంత్రి హాయనిధి నుంచి 2 లక్షల రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. నాటి పాలనలో పేదలకు వైద్యం భారంగా మారేదని సీఎం కేసీఆర్ పాలనలో అందరికి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.