నాగర్ కర్నూల్ : అహింస, సత్యాగ్రహం, అనే, మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప యోధుడు గాంధీజీ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గాంధీజీ మార్గం నేటి తరానికి అనుస రనీయమన్నారు. యువత గాంధీజీ మార్గాన్ని అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.