నారాయణపేట : కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే కొనుగోలు చేయక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వడ్ల కల్లాల ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.