నాగర్ కర్నూలు : భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ చేయడానికి లంచం తీసుకున్న ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటి సర్వేయర్(Deputy Surveyor) ను అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB ) రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే రైతు తన భూమికి చెందిన ప్రొసిడింగ్స్ కాపీ కోసం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ ఇన్స్పెక్టర్ రమావత్ వాస్య లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సిరాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శనివారం ఆర్డీవో కార్యాలయంలో రూ.8 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్ను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.