గద్వాల రూరల్, ఫిబ్రవరి 20 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని సంప్రదాయబద్ధంగా ఎద్దుల బండిపై మెట్టినింటికి తీసుకొస్తారు. మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేకంగా ఎద్దులబండిపై సారెను తీసుకుని అమ్మవారి పుట్టినిళ్లు గుర్రంగడ్డకు భాజాభజంత్రీలతో సాగనంపారు. అక్కడి నుంచి జమ్మిచే డు, లత్తీపురం, బీరెల్లీ మీదుగా గుర్రంగడ్డకు చేరుకుంటుంది. ప్రత్యేక పూజల అనంతరం మరుసటి రోజు (బుధవారం) తెల్లవారుజామున జమ్మిచేడుకు తీసుకొస్తారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ గా యత్రి, ఈవో పురేందర్కుమార్, సతీశ్, పాలక మం డలి సభ్యులు కాంబ్లే, జానకీరాములు, శంకర్, రా ము, సిబ్బంది మురళీధర్రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాశ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.