అచ్చంపేట టౌన్, మే 20 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని ఎంపీ రాములు ధీమా వ్యక్తం చేశారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. అచ్చంపేట పట్టణంలో శనివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. అందుకనే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు రై తాంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మే లో కూడా చెరువులు, కుంటలు నీటితో నిండి అ లుగు పారుతుండడం.. సీఎం కేసీఆర్ చలవేనన్నా రు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రం నే డు సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత చెరువులు, కుంటల్లో మిషన్ కాకతీయ ద్వా రా పూడికతీత చేపట్టి కాలువల ద్వారా నీటితో నిం పారన్నారు. సెప్టెంబర్ నాటికి ఏదుల, వట్టెం, నె ట్టెంపాడు, ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీరు అందేలా అధికారులు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
నూతనంగా ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1, ఫేజ్-2కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. దీంతో లింగా ల, బల్మూర్, అచ్చంపేట, పదర మండలాలకు కూడా సాగునీరు అందుతుందని ఆశాభావం వ్య క్తం చేశారు. దేశంలో పంటల దిగుబడి తెలంగాణాలోనే అధికమన్నారు. దేశం మొత్తంతో పో ల్చితే కేవలం తెలంగాణలోనే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటున్నదని గుర్తు చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరా కు రూ.10వేల నష్టపరిహారం ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైస్మిల్లర్లు, వ్యా పారులు ధాన్యం కొనుగోళ్లలో క్వింటాకు 10 నుం చి 15 కిలోల తరుగు తీస్తున్నారని.. అటువంటి వారిపై వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, పోలీ సు, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అలాం టి వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలన్నారు. స మావేశంలో నారాయణ్రావు, శరణ్గౌడ్, శ్రీహ రి, వెంకటేశ్, గోపాల్, జయచంద్రారెడ్డి, అశోక్రె డ్డి, యుగంధర్రావు తదితరులు పాల్గొన్నారు.