దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), ఫిబ్రవరి 25 : బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. చి న్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామం లో రూ.5లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఎంబీహెర్మోన్ చర్చి ప్రహరీని ఆదివారం ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్లో పేద ల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడయ్యారని తెలిపారు. రా నున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అ త్యధిక పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ నే గెలుస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.