అచ్చంపేట, ఏప్రిల్ 25 : తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే నల్లమల ప్రజల గొంతుకను ఢిల్లీలో వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ కం దనూలు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తో కలిసి పదర, అమ్రాబాద్ మండలాల్లో ప్ర చారం నిర్వహించారు. పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం మద్దిమడుగు, అనంతరం ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, పెట్రాల్చేను, వంకేశ్వరం, పదర, కుమ్మరోనిపల్లి, మాధవానిపల్లి, అమ్రాబాద్, మాచారం, మన్ననూర్లో ప్రచారం నిర్వహించగా ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుం డా వారికి స్వాగతం పలికారు.
మద్దిమడుగు లో ఇంటింటి ప్రచారం చేయగా కాంగ్రెస్ వ చ్చినంక తమ బతుకులు ఆగమయ్యాయని గ్రామస్తులు వాపోయారు. ఆర్ఎస్పీ మాట్లాడుతూ గతంలో ఎంపీలుగా గెలిచిన వాళ్లు ఆ లయంతోపాటు మద్దిమడుగు, ఇప్పలపల్లి ప్ర జల అభివృద్ధి గురించి పార్లమెంట్లో ఏనాడై న ప్రసంగించారా అని ప్రశ్నించారు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా తాగునీటికి నోచుకోని దుస్థితి నెలకొన్నదన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ అసమర్థుడని, ఆయన వల్ల ఏదీకాదన్నారు.
ఈ ప్రాంతవాసిగా చెప్పుకొంటున్న సీఎం రే వంత్రెడ్డి అచ్చంపేటకు ఏంచేశాడని ప్రశ్నించారు. స్థానిక అభ్యర్థులు లేనట్టుగా ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు రవిని కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి మన ప్రాంతాన్ని అవమానించిందన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో నల్లమల ప్రజల గొంతుకనవుతానన్నారు. కులం పేరు చెప్పుకొని రాజకీయం చేయొద్దని, ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని సూచించారు. చరిత్రను మార్చగలిగే సత్తా, విజన్ తనకుందన్నారు. పేదలకు సేవ చేసేందుకే రాజకీయంలోకి వచ్చానని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
మరోసారి అచ్చంపేట ప్రజలను మోసం చే సేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు తగి న బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు గువ్వల బాలరాజు అన్నారు. ఈ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ దోచుకునేందుకు చూస్తున్నదని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ రహస్యంగా వంతపాడుతున్నదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్రెడ్డివి గాలిమాటలని ప్రజలకు ఎప్పుడో అర్థమైందన్నారు. గ్రామాల్లో ప్రచారానికి చ్చే హస్తం పార్టీ నాయకులను ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త నవీన్కుమార్రెడ్డి జెడ్పీటీసీ రాంబాబు, వైఎస్ ఎంపీపీ వరుణ్, ఎంపీటీసీ సునీతాశ్రీను, సింగిల్విండో డైరెక్టర్లు, నాయకులు కోటిరెడ్డి, తార్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.