జడ్చర్లటౌన్, నవంబర్ 26 : పేద ప్రజల కో సం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చే స్తున్న బీఆర్ఎస్కు మద్దతు పలికి మరోసారి గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కూ తురు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఆ దివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూతురు స్ఫూర్తి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగు తూ మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జడ్చర్లను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చేసి లాండ్రీ దుకాణాలకు సీఎం కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తున్నారని గుర్తు చేశారు. మటన్మార్కెట్, చైతన్యనగర్కాల నీ, రంగారావుతోట, సిగ్నల్గడ్డ ప్రాంతాల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, మాజీ ఎంపీపీ లక్ష్మీశంకర్నాయక్, కౌన్సిలర్ నందకిశోర్గౌడ్, మాజీ సర్పంచ్ రేణుక, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజాపూర్, నవంబర్ 26 : ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గెలిపించాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆదివారం ఇంటింటికీ తిరిగి కారుగుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల కేంద్రంతోపాటు తిర్మలాపూర్, ఈద్గాన్పల్లి, మల్లెపల్లి, కల్లేపల్లి, ఖానాపూర్, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, గుండ్లపోట్లపల్లి, దోండ్లపల్లి, చొక్కంపేట, రాఘవాపూర్, కోర్రతండా, సింగమగూడతండాలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశై లం యాదవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, యాదగిరి, అనంద్గౌడ్, శ్రీశైలం, మహిపాల్రెడ్డి, శేఖర్రెడ్డి, విజయ్, శేఖర్, శ్రీశైలం, సత్తయ్య ఉన్నారు.
బాలానగర్, నవంబర్ 26 : 9 సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ గ్రామాధ్యక్షుడు రాజుగౌడ్ కోరారు. ఆదివారం మండలంలోని పెద్దరేవల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పథకాలను, సంక్షేమ ఫలాలు వివరించారు. కారు గుర్తు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో కోరారు. అదేవిధంగా చిన్నరేవల్లి లో బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రవిజాదవ్, శంకరాయపల్లితండాలో మాజీ సర్పంచ్ సోమ్లానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నా యకులు పరమేశ్వర్, లింగారెడ్డి, శశికాంత్రెడ్డి, శ్రీధర్గౌడ్, మధు, యాదయ్య, మల్లేశ్, అనంతయ్య, కుమా ర్, శ్రీను, రవి, లక్ష్మయ్య, పాండు, సాయిబాబ పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 26 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మితే గో స పడుతామని బీఆర్ఎస్ మండలాధ్యక్షడు పాం డు అన్నారు. ఆదివారం మండలంలోని వేముల, మల్లాపూర్, బోయిన్పల్లి, కొత్తపల్లి, చిల్వేర్, ఈదులబావితండా, మసిగుండ్లపల్లి తదితర గ్రా మాల్లో బీఆర్ఎస్ నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో, అమల చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కో రారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, బాలు, నారాయణరెడ్డి, భద్రయ్య, జైపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, గోపాల్రెడ్డి, చెన్నయ్య, వీరారెడ్డి, బీమ్రాజు, లక్ష్మణ్పవర్, కృష్ణయ్య, రాజు, కుమార్, ఆంజనేయులు, రమేశ్, వెంకటయ్య పాల్గొన్నారు.
జడ్చర్ల, నవంబర్ 26 : జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపుకో సం జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి, ఈర్లపల్లి, కిష్టంపల్లి, పెద్దఆదిరాల, చిన్నఆదిరాల, దేవునిగుట్టతండా, అల్వాన్పల్లి, కుర్వగడ్డపల్లి తదితర గ్రా మాల్లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఇం టింటి ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఈ పథకాలన్ని పోతాయన్నారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు లో కౌన్సిలర్ ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, బాలసుందర్రెడ్డి, విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.
నవాబ్పేట, నవంబర్ 26 : మండలంలోని యన్మన్గండ్ల, నవాబ్పేట, రాంసింగ్తం డా, లోకిరేవు, దాయపంతులపల్లి, హజిలాపూర్, దేపల్లి, పుట్టోనిపల్లితండా, అమ్మాపూర్, రుద్రా రం, కాకర్లపహాడ్ తదితర గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి వెళ్లి కారు గు ర్తుకు ఓటేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నమూనా బ్యాలెట్ పత్రాన్ని చూ యించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు గోపాల్గౌడ్, నర్సింహానాయక్, సత్యం, గంగమ్మ, లత, తరుణ్నాయక్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు శ్రీను, నాయకు లు లక్ష్మయ్య, హన్మంతు, కోట్ల రాజేశ్, రఘువీర్, రఘు, ఫాజిల్, రఘుగౌడ్, వినోద్రా వు, నర్సింగ్రావు, రాములునాయక్, యాదయ్య, వెంకటేశ్, తిరుపతయ్య, రవి, కుమార్, మణికంఠ, గ్రామస్తులు పాల్గొన్నారు.