కోయిలకొండ, అక్టోబర్ 12 : వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 22 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐదు లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మరో 20 రోజులో వరి కోతకు రానుండగా, అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో వారం రోజుల కిందట మండలానికి 2 లక్షల గన్నీ బ్యాగులు వచ్చాయి. మరో 2 లక్షల బ్యాగులు కూడా రానున్నట్లు సింగిల్విండో చైర్మన్ గురు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని గోదాంలలో గన్నీ బ్యాగులు సి ద్ధంగా ఉంచారు. సింగిల్విండో, ఐకేపీ కేం ద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు మండలంలో 16 కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖాధికారి రామ్పాల్ తెలిపారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.