భూత్పూర్, జనవరి 9 : దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి గుండెపోటుతో మృతిచెందగా, మంగళవా రం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నాసాగర్ గ్రామానికి చేరుకొని బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. ఆల శశివర్ధన్రెడ్డి చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి భార్య శ్రీలత, తల్లి వరలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో ఆమె మా ట్లాడారు.
ఎమ్మెల్సీ కవితతోపాటు ఎంపీ మన్నె శ్రీ నివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, ఎమ్మెల్సీ రాకను గుర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇంటి వద్ద బారులుదీరా రు. కార్యక్రమంలో వనపర్తి జెడ్పీ వైస్ చైర్మన్ వా మన్గౌడ్, ఎంపీపీ శేఖర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, ప్రదీప్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.