నాగర్కర్నూల్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. పదేండ్ల ప్రజాప్రస్తానం పాదయాత్ర గురువారం నుంచి మండలంలోని పుల్జాల గ్రామం నుంచి ప్రారంభమవుతుందని, పదేండ్లలో చేసిన అభివృద్ధి, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులకు ఎన్నికల జీవోలు వచ్చాయని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆగాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కర్ణాటక సీఎం స్వయంగా స్పష్టం చేసినట్లు తెలిపారు. అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు ఆరాట పడుతున్నారని, వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిందని, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందన్నారు.
సోనియమ్మ పేరు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సబ్బండ వర్గాలకు న్యాయం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ప్రజలు తెలివైన వాళ్లు అని, నవంబర్ 30న ఓటుతో తీర్పు చెప్తారన్నారు. నాకు ప్రధాన పోటీదారు నాగం జనార్దన్రెడ్డి అని, తండ్రి ఓ పార్టీ, కొడుకు ఓ పార్టీ అని కాంగ్రెస్ గెలవాలంటే నాగంకు టికెట్ ఇవ్వాలన్నారు. కొడుకు కోసం విలువలకి కూచకుళ్ల దామోదర్రెడ్డి తిలోదకాలు ఇచ్చారన్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీ హబ్, పరిశ్రమల స్థాపన, నీళ్లు, జిల్లా, మెడికల్ కాలేజీ, పాలమూరు మార్కాండేయ ఎత్తిపోతల పథకం లాంటివి ఎన్నో అభివృద్ధ్ది పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ సాకారంతో చేశానన్నారు. అదేవిధంగా పుల్జాల – వెంకటాపూర్, తాళ్లపల్లి, కార్వంగ బ్రిడ్జి, కార్వంగ – నందిపేట రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయని, వీటన్నింటినీ ప్రజలకు తెలియజేస్తా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడవ సారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బైకని శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీలు శ్రీనివాస్గౌడ్, మధు, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్/తాడూరు, అక్టోబర్ 25: వచ్చే ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను మెచ్చిన పలువురు నాయకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో చేరుతున్నారు. బుధవారం నాగర్కర్నూల్ మండలం పెద్దముద్దునూర్కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే మర్రి పారీ ్టకండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెద్దముద్దునూర్ గ్రామ నాయకులు మిద్దె శ్రీను, ధర్మేందర్, శంకర్, శివ, రామాంజనేయులుతోపాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాడూరు మండలంలోని మేడిపూర్, గుంతకోడూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మేడిపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజి, పాపయ్య, ఊషన్న, శివాజీ, కుర్మయ్య, బాలరాజు, ప్రకాశ్, కురుమూర్తి, వెంకటేశ్, మోహన్, గణేశ్, కృష్ణ, పరశురాములుతోపాటు 40మందికి కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా గుంతకోడూరు గ్రామానికి చెందిన వంద మందికిపైగా నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సుజాత, వసంత, విండో వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యార రమేశ్, నాయకులు కేశవులుగౌడ్, రాజుగౌడ్, జైపాల్రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 25: బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. బుధవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో శాయిన్పల్లికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు వార్డు సభ్యుడు దస్తగిరి, బాలస్వామి, బండారు కరుణాకర్, బండారు రాజు, వెంకటేశ్, రాజు, చంద్రయ్య, బీసం శివ, ఎల్లస్వామి, చెనమొని మల్లేశ్, మునీంద్ర, కల్మూరి జయరాం, బండారు వెంకటేశ్, బండారు సాయి, బండారు పెద్దరాజు, బండారు బాలయ్య, బండారు లోకేశ్, మంగలి గోపాల్, గుంటి విష్ణు, గుంటి మన్నెంకొండ, బీసం బంగారయ్య, గట్టిగాల్ల రాములు, బీసం చంద్రయ్య, బుసి రాములు, నార్లాపురం వెంకటయ్య, వడ్ల శ్రీకాంత్చారితో పాటు 40 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మర్రి గులాబీ కండు వా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.