దేవరకద్ర, డిసెంబర్ 31 : పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 69 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇస్తామని చెప్పిన విధంగా ఇచ్చిన హామీలను అమ లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్రెడ్డి, నాయకులు అరవింద్కుమార్రెడ్డి, కిషన్రావు, ఆదిహన్మంత్రెడ్డి, అంజిరెడ్డి, హన్మంత్రెడ్డి, ఫకీరన్న, సురేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అంజన్కుమార్రెడి, కుర్వ జవహర్ పాల్గొన్నారు