జడ్చర్లటౌన్, నవంబర్ 28 : కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను నమ్మొద్దని, టికెట్లు అమ్ముకొన్న కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని సైతం అమ్మేస్తారని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో బుధవారం నిర్వహించిన రోడ్షోకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో జనసందోహంగా మారింది.
జై కేసీఆర్, జై లక్ష్మారెడ్డి నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తో కలిసి లక్ష్మారెడ్డి రోడ్షో పాల్గొన్నారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మొద్దని, పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తారని చెప్పారు.